Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:52 PM

జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి

జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి

జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి
February 24, 2026 04:05 AM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ముసునూరు మండలం చింతలవల్లిలో ఉపాధి కూలీల ధర్నా

ఏలూరు జిల్లా ముసునూరు మండలం చింతలవల్లిలో ఉపాధి కూలీలు ఆందోళన బాట పట్టారు. (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎ)ను యథావిధిగా కొనసాగించాలని, వీబి గ్రామజీ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామంలో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా వేముల బక్కయ్య మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టం గ్రామీణ కూలీలకు జీవనాధారమని పేర్కొన్నారు. పథకం కొనసాగింపుపై నెలకొన్న అనిశ్చితి కూలీలలో అయోమయం సృష్టిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. చట్టం ప్రకారం పని కోరిన 15 రోజుల్లో ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని, పని కల్పించని పక్షంలో నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంటుందని గుర్తుచేశారు.

అదేవిధంగా ఈ చట్టం ద్వారా మౌలిక వసతుల అభివృద్ధి, కార్మికులకు బీమా సౌకర్యం వంటి ప్రయోజనాలు లభిస్తున్నాయని తెలిపారు. సంవత్సరానికి 200 పని దినాలు కల్పించడంతో పాటు రోజుకు రూ.600 వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రయోజనాలు ప్రత్యామ్నాయ పథకాల ద్వారా అందుబాటులోకి రావని, అందుకే చట్టాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు.

మార్చి 2వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఉపాధి కూలీలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు కరపత్రాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో పల్లెపాము భవాని, మేడూరు సర్వీసు, ఎఫ్‌సి, బేబీ శాలిని, రాణి తదితర ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News