Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 27, 2026 07:02 PM

జాతీయ సైన్స్ దినోత్సవానికి చాట్రాయి నుంచి పి. తిరుపతయ్య, బి. చంద్రకళ ఉపాధ్యాయ దంపతుల ఔదార్యం

జాతీయ సైన్స్ దినోత్సవానికి చాట్రాయి నుంచి పి. తిరుపతయ్య, బి. చంద్రకళ ఉపాధ్యాయ దంపతుల ఔదార్యం

జాతీయ సైన్స్ దినోత్సవానికి చాట్రాయి నుంచి పి. తిరుపతయ్య, బి. చంద్రకళ ఉపాధ్యాయ దంపతుల ఔదార్యం
February 27, 2026 05:36 PM 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి మండలం నుంచి జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలకు రూ.10,000 విరాళం అందించిన ఉపాధ్యాయ దంపతులు పి. తిరుపతయ్య, బి. చంద్ర కళావతి అభినందనలకు పాత్రులయ్యారు. విద్యా అభివృద్ధి, శాస్త్ర విజ్ఞాన ప్రోత్సాహానికి తమ వంతు సహకారం అందించడం ప్రశంసనీయమని విద్యావేత్తలు పేర్కొన్నారు.

డెమొక్రటిక్ పిఆర్‌టియు మరియు జాతీయ ఉపాధ్యాయ సేవాదళ్ ఆధ్వర్యంలో, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రీసెర్చ్ ఫౌండేషన్ సహకారంతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఫిబ్రవరి 28న నిర్వహించనున్న జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకల బహుమతి ప్రదాన కార్యక్రమానికి ఈ విరాళం అందించారు.

చాట్రాయి మండలానికి చెందిన స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లీష్)గా సేవలందిస్తున్న పి. తిరుపతయ్య, బి. చంద్ర కళావతి దంపతులు విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని సహచరులు తెలిపారు.

డెమొక్రటిక్ పిఆర్‌టియు ఏపీ పక్షాన డి. శ్రీను, పీవీఆర్‌లు దంపతులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాంటి సహకారం ఇతర ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News