Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:49 AM

జాతీయ రహదారి 65పై గుర్తుతెలియని వ్యక్తి మృతి

జాతీయ రహదారి 65పై గుర్తుతెలియని వ్యక్తి మృతి

జాతీయ రహదారి 65పై గుర్తుతెలియని వ్యక్తి మృతి
26-02-2026 567 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ శివారులో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి 65పై 7 హోటల్ సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు.

చిట్యాల ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం, సుమారు 50 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో రహదారిని దాటుతున్న సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టినట్లు సమాచారం. ఢీకొన్న వాహనం అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించకపోవడంతో అతన్ని గుర్తుతెలియని వ్యక్తిగా నమోదు చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.మృతుడు నలుపు రంగు స్వెటర్, బ్రౌన్ కలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. మృతుని వివరాలు తెలిసిన వారు 8712670187, 8712670148 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.


Sthanikam

జాతీయ రహదారి 65పై గుర్తుతెలియని వ్యక్తి మృతి

Article Image

నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ శివారులో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి 65పై 7 హోటల్ సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు.

చిట్యాల ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం, సుమారు 50 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో రహదారిని దాటుతున్న సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టినట్లు సమాచారం. ఢీకొన్న వాహనం అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించకపోవడంతో అతన్ని గుర్తుతెలియని వ్యక్తిగా నమోదు చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.మృతుడు నలుపు రంగు స్వెటర్, బ్రౌన్ కలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. మృతుని వివరాలు తెలిసిన వారు 8712670187, 8712670148 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News