Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా ఆసియన్ చెస్ చాంపియన్ మేకల అభినవ్ జయంతి..... పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 03:21 AM

జాతీయ రహదారి 65పై గుర్తుతెలియని వ్యక్తి మృతి

జాతీయ రహదారి 65పై గుర్తుతెలియని వ్యక్తి మృతి

జాతీయ రహదారి 65పై గుర్తుతెలియని వ్యక్తి మృతి
February 26, 2026 08:09 PM 563 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ శివారులో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి 65పై 7 హోటల్ సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు.

చిట్యాల ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం, సుమారు 50 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో రహదారిని దాటుతున్న సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టినట్లు సమాచారం. ఢీకొన్న వాహనం అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించకపోవడంతో అతన్ని గుర్తుతెలియని వ్యక్తిగా నమోదు చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.మృతుడు నలుపు రంగు స్వెటర్, బ్రౌన్ కలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. మృతుని వివరాలు తెలిసిన వారు 8712670187, 8712670148 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News