జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి
జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి
Biksham
రాజీనే రాజమార్గం : జిల్లా పోలీసు అధికారి నరసింహ
సూర్యాపేట: ఈ నెల 28న నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పోలీసు అధికారి నరసింహ సూచించారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి పోలీసు అధికారులతో కార్యాలయం నుంచి దృశ్య సమావేశం నిర్వహించి సూచనలు అందించారు.
రాజీ పడదగిన కేసులను గుర్తించి, వాటిలో ఉన్న ఇరు వర్గాల వారికి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఎక్కువ సంఖ్యలో కేసులను పరిష్కరించాలని సూచించారు.
లోక్ అదాలత్ ద్వారా ఇరువైపుల సమ్మతితో త్వరితగతిన సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. క్రిమినల్ రాజీ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన, కుటుంబ సమస్యలు, మద్యం సేవించి వాహనం నడపడం, వాహన చట్ట ఉల్లంఘనలు, చెక్ బౌన్స్, బ్యాంకు వసూళ్లు, విద్యుత్ చౌర్యం వంటి వివిధ కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు.
కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృథా చేసుకోవద్దని, న్యాయశాఖ అందిస్తున్న ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని సూచించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి