Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:19 AM

జాతీయ లోక్ అదాలత్ విజయానికి సమన్వయం కీలకం. వి. మాధవి లత

జాతీయ లోక్ అదాలత్ విజయానికి సమన్వయం కీలకం. వి. మాధవి లత

జాతీయ లోక్ అదాలత్ విజయానికి సమన్వయం కీలకం. వి. మాధవి లత
March 18, 2026 06:00 AM 61 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆలేరు కోర్టులో న్యాయవాదులు, పోలీసులతో సమావేశం

యాదాద్రి భువనగిరి,

జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ విజయవంతానికి సమన్వయం అత్యంత ముఖ్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచనల మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సంస్థ కార్యదర్శి వి. మాధవి లత ఆలేరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టును సందర్శించి న్యాయవాదులు, పోలీసు అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఆలేరు జూనియర్ సివిల్ జడ్జి ఆర్. అజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ మార్చి 28న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కరించేలా కృషి చేయాలని సూచించారు.

గ్రామ స్థాయిలో విస్తృత ప్రచారం చేపట్టి కక్షిదారులకు ముందుగానే నోటీసులు అందజేయాలని తెలిపారు. అదేవిధంగా ప్రతిరోజు ప్రీ-సిట్టింగ్స్ నిర్వహిస్తున్నామని, వాటి ద్వారా కేసులను ముందస్తుగా పరిష్కరించుకునే అవకాశం ఉందని ప్రజలకు తెలియజేయాలని సూచించారు.

ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు వనమా రాజు, ఉపాధ్యక్షులు టి. హరికృష్ణ, కార్యదర్శి చాంద్ పాషా, ట్రెజరర్ రవికుమార్, న్యాయవాదులు జుకంటి రవీందర్, సీసా శ్రీనివాస్ గౌడ్, కె.వి. ప్రసాద్ తదితరులు, ఎపిపిఒ పద్మజ, ఆలేరు సి.ఐ. ఏలాద్రి, మోటకొండూరు ఎస్.ఐ. అశోక్, గుండాల ఎస్.ఐ. తేజం రెడ్డి, ఆత్మకూర్ సి.ఐ. హనుమమంతు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News