జాతీయ లోక్ అదాలత్ విజయానికి న్యాయవాదుల సహకారం అవసరం.
జాతీయ లోక్ అదాలత్ విజయానికి న్యాయవాదుల సహకారం అవసరం.
స్థానికం బృందం
భువనగిరిలో బార్ అసోసియేషన్తో న్యాయ సేవా సంస్థ సమావేశం
జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయడంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించాలని సంస్థ కార్యదర్శి వి. మాధవి లత సూచించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు సూచనల మేరకు భువనగిరిలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్చి 28న జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ సంఖ్యలో సివిల్ కేసులు రాజీ మార్గంలో పరిష్కరించేలా కృషి చేయాలని కోరారు. రాజీ పరిష్కారం వల్ల కక్షిదారులు త్వరితగతిన న్యాయం పొందడమే కాకుండా, పరస్పర విభేదాలు తగ్గి స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందని తెలిపారు.
సంబంధిత కేసుల్లో న్యాయవాదులు కక్షిదారులకు సరైన మార్గదర్శనం ఇవ్వాలని, రాజీ ద్వారా సివిల్ వివాదాలతో పాటు వాటికి అనుబంధంగా ఉన్న క్రిమినల్ కేసులు కూడా పరిష్కారమయ్యే అవకాశం ఉందని వివరించారు. అదేవిధంగా రాజీ ద్వారా పరిష్కరించిన కేసుల్లో కోర్టు ఫీజు తిరిగి లభిస్తుందని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
మార్చి 28 వరకు ప్రతిరోజూ భువనగిరి కోర్టు ప్రాంగణంలో ప్రీ-సిట్టింగ్స్ నిర్వహించి కేసుల పరిష్కారానికి అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు.
ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు వి. వెంకటయ్య గౌడ్, కార్యదర్శి బొల్లేపల్లి కుమార్, ట్రెజరర్ చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి