Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:18 AM

జాతీయ లోక్ అదాలత్ విజయానికి న్యాయవాదుల సహకారం అవసరం.

జాతీయ లోక్ అదాలత్ విజయానికి న్యాయవాదుల సహకారం అవసరం.

జాతీయ లోక్ అదాలత్ విజయానికి న్యాయవాదుల సహకారం అవసరం.
March 18, 2026 06:11 AM 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరిలో బార్ అసోసియేషన్‌తో న్యాయ సేవా సంస్థ సమావేశం

జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయడంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించాలని సంస్థ కార్యదర్శి వి. మాధవి లత సూచించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు సూచనల మేరకు భువనగిరిలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్చి 28న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ సంఖ్యలో సివిల్ కేసులు రాజీ మార్గంలో పరిష్కరించేలా కృషి చేయాలని కోరారు. రాజీ పరిష్కారం వల్ల కక్షిదారులు త్వరితగతిన న్యాయం పొందడమే కాకుండా, పరస్పర విభేదాలు తగ్గి స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందని తెలిపారు.

సంబంధిత కేసుల్లో న్యాయవాదులు కక్షిదారులకు సరైన మార్గదర్శనం ఇవ్వాలని, రాజీ ద్వారా సివిల్ వివాదాలతో పాటు వాటికి అనుబంధంగా ఉన్న క్రిమినల్ కేసులు కూడా పరిష్కారమయ్యే అవకాశం ఉందని వివరించారు. అదేవిధంగా రాజీ ద్వారా పరిష్కరించిన కేసుల్లో కోర్టు ఫీజు తిరిగి లభిస్తుందని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

మార్చి 28 వరకు ప్రతిరోజూ భువనగిరి కోర్టు ప్రాంగణంలో ప్రీ-సిట్టింగ్స్ నిర్వహించి కేసుల పరిష్కారానికి అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు.

ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు వి. వెంకటయ్య గౌడ్, కార్యదర్శి బొల్లేపల్లి కుమార్, ట్రెజరర్ చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News