జర్నలిస్టుపై దాడి చేసిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలి
జర్నలిస్టుపై దాడి చేసిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలి
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండల పరిధిలోని అతిమ్యాల్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు మహేశ్ కుమార్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దళిత జర్నలిస్టు ఫోరం నాయకులు సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్కు ఫిర్యాదు చేశారు. వార్త సేకరణకు వెళ్లిన జర్నలిస్టు రాములుపై మార్చి 17న ఉపాధ్యాయుడు దాడి చేశాడని ఆరోపిస్తూ, ఈ ఘటనలో సహకరించిన గ్రామస్థులపైనా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఉమ్మడి మెదక్ జిల్లా దళిత జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు రాపాక విజయరాజు వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయని, విధి నిర్వహణలో ఉన్న పాత్రికేయులకు రక్షణ కల్పిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దత్తు రెడ్డి, జర్నలిస్టు సాయిలు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి