PRINT TIME: July 12, 2026 01:42 AM
జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
March 12, 2026 10:12 PM
20 Views
స్థానికం ప్రతినిధి :
యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter
-ప్రభుత్వ విప్ ఐలయ్యకు వినతి పత్రం అందజేసిన "తెలంగాణా జర్నలిస్ట్ అసోసియేషన్" జిల్లా అధ్యక్షులు షానూర్ బాబా
యాదగిరిగుట్ట:యాదాద్రి భువనగిరి జిల్లాలోని పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల సమస్యలను పరిష్కరించి,ఆదుకోవాలని ప్రభుత్వ విప్,ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్యకు
తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ బాబా యాదగిరిగుట్ట పట్టణంలోని వారి కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు విప్ ఐలయ్య మాట్లాడుతూ...జర్నలిస్టుల ఇండ్ల సమస్యలను ఖచ్చితంగా పరిష్కరించి,ఇందిరమ్మ గృహ పథకంలో ప్రాధాన్యత కల్పించి అన్ని విధాలుగా ఆదుకుంటారని అన్నారు. వారితోపాటు యాదగిరిగుట్ట టీజేఏ మండల అధ్యక్షులు రాజు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి