Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి: మహిళా కాంగ్రెస్ డిమాండ్ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 07:23 PM

జనంపల్లిలో బీఆర్‌ఎస్‌ పార్టీలో 20 మంది చేరికలు

జనంపల్లిలో బీఆర్‌ఎస్‌ పార్టీలో 20 మంది చేరికలు

జనంపల్లిలో బీఆర్‌ఎస్‌ పార్టీలో  20 మంది చేరికలు
March 28, 2026 09:01 PM 929 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలం జనంపల్లి గ్రామంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు . శనివారం ఎంఎన్ రెడ్డి, చల్లమల బిక్షం రెడ్డి, వంగాల ఎల్లయ్య, మేడబోయిన నవీన్ తమ అనుచరులతో కలిసి సుమారు 20 మంది బీఆర్‌ఎస్‌లో చేరారు.

గ్రామ శాఖ అధ్యక్షుడు నక్క నరేందర్, ఉపాధ్యక్షుడు బీరం రాజిరెడ్డి ఆధ్వర్యంలో వీరిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నక్క నరేందర్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆదేశాల మేరకు గ్రామాల్లో పార్టీ బలోపేతానికి చేరికలు వేగవంతమవుతున్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పోశబోయిన మల్లేష్, మాజీ ఎంపీటీసీ సుధీర్ బాబు, జనంపల్లి మాజీ సర్పంచ్ రేఖ యాదయ్య, ఉప సర్పంచ్ చొప్పరి నర్సింహా, వార్డు సభ్యులు నక్క రాములు, నల్ల సైదులు, యూత్ అధ్యక్షుడు సంగీశెట్టి శివాజీ తదితరులు పాల్గొని కొత్తగా చేరిన వారిని అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News