జనంపల్లిలో బీఆర్ఎస్ పార్టీలో 20 మంది చేరికలు
జనంపల్లిలో బీఆర్ఎస్ పార్టీలో 20 మంది చేరికలు
Editor Desk
రామన్నపేట మండలం జనంపల్లి గ్రామంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు . శనివారం ఎంఎన్ రెడ్డి, చల్లమల బిక్షం రెడ్డి, వంగాల ఎల్లయ్య, మేడబోయిన నవీన్ తమ అనుచరులతో కలిసి సుమారు 20 మంది బీఆర్ఎస్లో చేరారు.
గ్రామ శాఖ అధ్యక్షుడు నక్క నరేందర్, ఉపాధ్యక్షుడు బీరం రాజిరెడ్డి ఆధ్వర్యంలో వీరిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నక్క నరేందర్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆదేశాల మేరకు గ్రామాల్లో పార్టీ బలోపేతానికి చేరికలు వేగవంతమవుతున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పోశబోయిన మల్లేష్, మాజీ ఎంపీటీసీ సుధీర్ బాబు, జనంపల్లి మాజీ సర్పంచ్ రేఖ యాదయ్య, ఉప సర్పంచ్ చొప్పరి నర్సింహా, వార్డు సభ్యులు నక్క రాములు, నల్ల సైదులు, యూత్ అధ్యక్షుడు సంగీశెట్టి శివాజీ తదితరులు పాల్గొని కొత్తగా చేరిన వారిని అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి