జనవరి 26న రైతు–కార్మిక సమస్యలపై మోటార్ సైకిల్ ర్యాలీ
జనవరి 26న రైతు–కార్మిక సమస్యలపై మోటార్ సైకిల్ ర్యాలీ
Biksham
నల్ల చట్టాల రద్దుకు పిలుపు
పాలకుల ద్వంద విధానాలే సంక్షోభానికి కారణం
సూర్యాపేట జిల్లా స్థానిక ప్రతినిధి బిక్షం
రైతు, వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జనవరి 26న మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. స్థానిక ధర్మ బిక్షం భవనంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కంబాల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్, ఏఐకేఎఫ్ రాష్ట్ర నాయకులు వరికుప్పల వెంకన్నలు మాట్లాడారు. విత్తన చట్టం, విద్యుత్ బిల్లు, విబిజీ రామ్ జీ పథకం, నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ, కార్మిక రంగాల సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయని, వాటి పరిష్కారంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రైతుల అప్పులు, ఆత్మహత్యలు ఆగడం లేదని, దీనికి ప్రభుత్వాల ద్వంద విధానాలే కారణమన్నారు.
రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఎస్కేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించి, నల్ల చట్టాలను దొడ్డి దారిన తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
రైతాంగం, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జనవరి 26న నిర్వహించే మోటార్ సైకిల్ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శంకర్, ఏఐకేఎఫ్ రాష్ట్ర నాయకుడు ఎస్కే నజీర్, సీపీఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, కెవీపీఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నరసయ్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి