Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా కవాడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం "కామాంధుడి కర్కశం.. చిన్నారి జీవితంతో చెలగాటం!" అత్యాచారం అనంతరం హత్యాయత్నం చేశాడని ఆరోపణలు.. ప్రాణాపాయ స్థితిలో బాధిత బాలిక సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 15, 2026 07:11 AM

జనవరి 26న రైతు–కార్మిక సమస్యలపై మోటార్ సైకిల్ ర్యాలీ

జనవరి 26న రైతు–కార్మిక సమస్యలపై మోటార్ సైకిల్ ర్యాలీ

జనవరి 26న రైతు–కార్మిక సమస్యలపై మోటార్ సైకిల్ ర్యాలీ
January 24, 2026 02:25 PM 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

నల్ల చట్టాల రద్దుకు పిలుపు

పాలకుల ద్వంద విధానాలే సంక్షోభానికి కారణం

సూర్యాపేట జిల్లా స్థానిక ప్రతినిధి బిక్షం

రైతు, వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జనవరి 26న మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. స్థానిక ధర్మ బిక్షం భవనంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కంబాల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్, ఏఐకేఎఫ్ రాష్ట్ర నాయకులు వరికుప్పల వెంకన్నలు మాట్లాడారు. విత్తన చట్టం, విద్యుత్ బిల్లు, విబిజీ రామ్ జీ పథకం, నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

వ్యవసాయ, కార్మిక రంగాల సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయని, వాటి పరిష్కారంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రైతుల అప్పులు, ఆత్మహత్యలు ఆగడం లేదని, దీనికి ప్రభుత్వాల ద్వంద విధానాలే కారణమన్నారు.

రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఎస్‌కేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించి, నల్ల చట్టాలను దొడ్డి దారిన తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

రైతాంగం, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జనవరి 26న నిర్వహించే మోటార్ సైకిల్ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శంకర్, ఏఐకేఎఫ్ రాష్ట్ర నాయకుడు ఎస్‌కే నజీర్, సీపీఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, కెవీపీఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నరసయ్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News