స్థానికం ప్రతినిధి సూర్యాపేట:
సూర్యాపేట జిల్లా పాలకీడు మండల కేంద్రంలో జనపహాడ్ దర్గా గ్రామంలో గల ప్రఖ్యాత దర్గా ఉర్సు జాతర ఈ నెల జనవరి 21 నుంచి 23,24వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఉర్సు జాతరకు మండలంతో పాటు పరిసర గ్రామాలు, జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశముంది.ఈ సందర్భంగా దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు, ఖవ్వాలి కార్యక్రమాలు, ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కులమతాలకు అతీతంగా భక్తులందరూ ఈ పవిత్ర ఉర్సు జాతరలో పాల్గొని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి