Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 26, 2026 09:17 PM

జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రారంభం

జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రారంభం

జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రారంభం
February 26, 2026 07:16 PM 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయిలో ఫిబ్రవరి 26 నుంచి మార్చి 10 వరకు ప్రత్యేక కార్యక్రమం

ప్రతి జనసైనికుడు సభ్యత్వం తీసుకోవాలి – మొండ్రు సురేష్ పిలుపు

చాట్రాయి మండలంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 10 వరకు సభ్యత్వ నమోదు కొనసాగనున్నట్లు మండల ప్రధాన కార్యదర్శి మొండ్రు సురేష్ వెల్లడించారు.

మండలంలోని ప్రతి జనసైనికుడు తప్పనిసరిగా క్రియాశీలక సభ్యత్వం తీసుకోవాలని, కొత్తగా చేరాలనుకునే వారు మరియు పాత సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రారంభించిన ఈ క్రియాశీలక సభ్యత్వ పథకం ద్వారా సభ్యులకు పలు భద్రతా ప్రయోజనాలు అందనున్నాయని తెలిపారు. ఇందులో రూ.5 లక్షల జీవిత భీమా, ప్రమాదవశాత్తు శాశ్వత అంగవైకల్యానికి రూ.2 లక్షల ఆర్థిక సహాయం, అలాగే రూ.50 వేల ప్రమాద భీమా సదుపాయం కల్పించబడుతుందని వివరించారు.

జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు మరియు వారి కుటుంబాలకు అండగా నిలవాలనే లక్ష్యంతో ఈ భీమా సదుపాయాలు అమలు చేస్తున్నామని మొండ్రు సురేష్ తెలిపారు.

సభ్యత్వానికి అవసరమైన పత్రాలు:

ఆధార్ కార్డు

పాస్‌పోర్ట్ సైజు ఫోటో

నామినీ ఆధార్ కార్డు

రూ.400 నగదు

శాశ్వత ఫోన్ నంబర్

సభ్యత్వం పొందాలనుకునే వారు సెల్ నెం: 9951253124 ను సంప్రదించాలని మొండ్రు సురేష్ సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News