Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:13 PM

జనసేన దిమ్మె ఏర్పాటుకు నాయకుల ప్రశంసలు – చిన్నంపేటలో పరిశీలన

జనసేన దిమ్మె ఏర్పాటుకు నాయకుల ప్రశంసలు – చిన్నంపేటలో పరిశీలన

జనసేన దిమ్మె ఏర్పాటుకు నాయకుల ప్రశంసలు – చిన్నంపేటలో పరిశీలన
March 15, 2026 08:33 PM 70 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని చిన్నంపేట గ్రామంలో జనసేన పార్టీకి చెందిన నాయకులు తేళ్ళూరి ప్రసాద్ నూతనంగా ఏర్పాటు చేస్తున్న జనసేన పార్టీ జెండా దిమ్మెను ఈరోజు నూజివీడు నియోజకవర్గ నాయకులు మరియు ఉమ్మడి కృష్ణా జిల్లాల అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ, నియోజకవర్గ నాయకులు ముమ్మలనేని సునీల్ కుమార్ మరియు జనసైనికులు కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా నాయకులు మరీదు శివరామకృష్ణ, ముమ్మలనేని సునీల్ కుమార్ మాట్లాడుతూ తేళ్ళూరి ప్రసాద్ జనసేన పార్టీపై ఉన్న అభిమానం తో స్వంత ఖర్చులతో పార్టీ జెండా దిమ్మెను ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రశంసించారు. పార్టీ పట్ల ఆయన చూపుతున్న నిబద్ధత ప్రతి కార్యకర్తకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు.

జెండా దిమ్మె ఆవిష్కరణ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు జనసేన పార్టీ నాయకులుగా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని మరీదు శివరామకృష్ణ హామీ ఇచ్చారు. త్వరితగతిన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు, చాట్రాయి మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు మాదాసు చంద్రకళ, టీడీపీ నేత చిన్న పుల్లయ్య, నాగుల అశోక్, చింతా సాయి, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News