జనగణన–2027 శిక్షణకు శ్రీకారం.ఖచ్చితమైన డేటా సేకరణపై దృష్టి పెట్టాలి: అదనపు కలెక్టర్
జనగణన–2027 శిక్షణకు శ్రీకారం.ఖచ్చితమైన డేటా సేకరణపై దృష్టి పెట్టాలి: అదనపు కలెక్టర్
Editor Desk
జనగణన–2027 ఫేజ్–1లో భాగంగా గృహాల జాబితా, గృహ గణన (HLO) నిర్వహణకు నూతనంగా ఎంపికైన టెక్నికల్ అసిస్టెంట్లు, జనాభా లెక్కల ఛార్జ్ క్లర్క్లకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, శిక్షణ కార్యక్రమం ఈ నెల 24 నుంచి 26 వరకు మూడు రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. జనగణన దేశ అభివృద్ధికి కీలకమైన ప్రాథమిక సమాచార సేకరణ ప్రక్రియ అని పేర్కొన్నారు.
ప్రతి వివరాన్ని ఖచ్చితంగా నమోదు చేయాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని స్పష్టం చేశారు. టెక్నికల్ అసిస్టెంట్లు సాంకేతిక పరికరాల వినియోగంపై పూర్తి అవగాహన పొందాలని, డేటా సేకరణలో పారదర్శకత పాటించాలని సూచించారు. శిక్షణలో బోధించే ప్రతి అంశాన్ని సమగ్రంగా అర్థం చేసుకుని విధుల్లో అమలు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఓ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి