Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:31 AM

జనగణన–2027 శిక్షణకు శ్రీకారం.ఖచ్చితమైన డేటా సేకరణపై దృష్టి పెట్టాలి: అదనపు కలెక్టర్

జనగణన–2027 శిక్షణకు శ్రీకారం.ఖచ్చితమైన డేటా సేకరణపై దృష్టి పెట్టాలి: అదనపు కలెక్టర్

జనగణన–2027 శిక్షణకు శ్రీకారం.ఖచ్చితమైన డేటా సేకరణపై దృష్టి పెట్టాలి: అదనపు కలెక్టర్
24-03-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జనగణన–2027 ఫేజ్–1లో భాగంగా గృహాల జాబితా, గృహ గణన (HLO) నిర్వహణకు నూతనంగా ఎంపికైన టెక్నికల్ అసిస్టెంట్లు, జనాభా లెక్కల ఛార్జ్ క్లర్క్‌లకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, శిక్షణ కార్యక్రమం ఈ నెల 24 నుంచి 26 వరకు మూడు రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. జనగణన దేశ అభివృద్ధికి కీలకమైన ప్రాథమిక సమాచార సేకరణ ప్రక్రియ అని పేర్కొన్నారు.

ప్రతి వివరాన్ని ఖచ్చితంగా నమోదు చేయాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని స్పష్టం చేశారు. టెక్నికల్ అసిస్టెంట్లు సాంకేతిక పరికరాల వినియోగంపై పూర్తి అవగాహన పొందాలని, డేటా సేకరణలో పారదర్శకత పాటించాలని సూచించారు. శిక్షణలో బోధించే ప్రతి అంశాన్ని సమగ్రంగా అర్థం చేసుకుని విధుల్లో అమలు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సీపీఓ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జనగణన–2027 శిక్షణకు శ్రీకారం.ఖచ్చితమైన డేటా సేకరణపై దృష్టి పెట్టాలి: అదనపు కలెక్టర్

Article Image

జనగణన–2027 ఫేజ్–1లో భాగంగా గృహాల జాబితా, గృహ గణన (HLO) నిర్వహణకు నూతనంగా ఎంపికైన టెక్నికల్ అసిస్టెంట్లు, జనాభా లెక్కల ఛార్జ్ క్లర్క్‌లకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, శిక్షణ కార్యక్రమం ఈ నెల 24 నుంచి 26 వరకు మూడు రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. జనగణన దేశ అభివృద్ధికి కీలకమైన ప్రాథమిక సమాచార సేకరణ ప్రక్రియ అని పేర్కొన్నారు.

ప్రతి వివరాన్ని ఖచ్చితంగా నమోదు చేయాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని స్పష్టం చేశారు. టెక్నికల్ అసిస్టెంట్లు సాంకేతిక పరికరాల వినియోగంపై పూర్తి అవగాహన పొందాలని, డేటా సేకరణలో పారదర్శకత పాటించాలని సూచించారు. శిక్షణలో బోధించే ప్రతి అంశాన్ని సమగ్రంగా అర్థం చేసుకుని విధుల్లో అమలు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సీపీఓ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News