జనగణన-2027కు కసరత్తు వేగం. పారదర్శకంగా, తప్పుల్లేకుండా నిర్వహించాలి: అదనపు కలెక్టర్
జనగణన-2027కు కసరత్తు వేగం. పారదర్శకంగా, తప్పుల్లేకుండా నిర్వహించాలి: అదనపు కలెక్టర్
Editor Desk
జనగణన-2027ను పారదర్శకంగా, సమగ్రంగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు అన్నారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జనగణన-2027 ఫేజ్–1 గృహాల గణనకు సంబంధించి క్షేత్రస్థాయి శిక్షకుల (ఫీల్డ్ ట్రైనర్స్) శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మే 11 నుంచి ప్రారంభమయ్యే గృహాల గణనలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా కచ్చితత్వంతో నిర్వహించాలని సూచించారు. ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలను పూర్తిగా, సరిగా నమోదు చేయాల్సిన అవసరాన్ని వివరించారు. గణన ప్రక్రియలో నాణ్యత, సమగ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.
ప్రతి అధికారి తన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించాలని, ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లకు సమగ్రంగా, నాణ్యమైన శిక్షణ అందించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జనగణన అధికారి వెంకటరమణతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి