Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టాలెంట్ టెస్ట్‌లో టాపర్‌గా నిలిచిన విద్యార్థికి రూ.4 లక్షల ప్రోత్సాహక బహుమతి సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల తీర్పు: మత మార్పిడికి అడ్డుకట్ట.. రాజ్యాంగ సవరణ డిమాండ్ గర్జింపు! “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” 6లోగా అప్లై చేసుకోండి – జర్నలిస్టులకు అక్రెడిటేషన్ గడువు శ్రీరామ నవమి సందర్భంగా సుద్దకుంటపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి విగ్రహ ఊరేగింపు ఘనంగా “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 28, 2026 05:35 PM

జనగణన-2027కు కసరత్తు వేగం. పారదర్శకంగా, తప్పుల్లేకుండా నిర్వహించాలి: అదనపు కలెక్టర్

జనగణన-2027కు కసరత్తు వేగం. పారదర్శకంగా, తప్పుల్లేకుండా నిర్వహించాలి: అదనపు కలెక్టర్

జనగణన-2027కు కసరత్తు వేగం.  పారదర్శకంగా, తప్పుల్లేకుండా నిర్వహించాలి: అదనపు కలెక్టర్
March 28, 2026 03:45 PM 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జనగణన-2027ను పారదర్శకంగా, సమగ్రంగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జనగణన-2027 ఫేజ్–1 గృహాల గణనకు సంబంధించి క్షేత్రస్థాయి శిక్షకుల (ఫీల్డ్ ట్రైనర్స్) శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మే 11 నుంచి ప్రారంభమయ్యే గృహాల గణనలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా కచ్చితత్వంతో నిర్వహించాలని సూచించారు. ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలను పూర్తిగా, సరిగా నమోదు చేయాల్సిన అవసరాన్ని వివరించారు. గణన ప్రక్రియలో నాణ్యత, సమగ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.

ప్రతి అధికారి తన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించాలని, ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లకు సమగ్రంగా, నాణ్యమైన శిక్షణ అందించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జనగణన అధికారి వెంకటరమణతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News