Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:09 AM

జనాభా గణన–2027 సమర్థవంతంగా నిర్వహించాలి అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

జనాభా గణన–2027 సమర్థవంతంగా నిర్వహించాలి అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

జనాభా గణన–2027 సమర్థవంతంగా నిర్వహించాలి అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
17-03-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జనాభా గణన–2027 ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు, చార్జ్ అధికారులు మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సూచించారు.

మంగళవారం జరిగిన జనాభా గణన–సెన్సెస్ 2027కు సంబంధించిన చార్జ్ అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, గణనను రెండు దశల్లో సమగ్రంగా చేపట్టాలని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హౌస్ లిస్టింగ్‌ను కచ్చితంగా నిర్వహిస్తే సెన్సెస్ ప్రక్రియ సాఫీగా పూర్తవుతుందని అన్నారు. బ్లాక్ వారీగా ప్రణాళికలు రూపొందించి సులభతరంగా గణన చేపట్టాలని సూచించారు. ప్రతి దశను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

జనాభా గణన–2027లో పాల్గొనే సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ సమగ్ర సమాచార సేకరణపై దృష్టి పెట్టాలని అన్నారు. డిజిటల్ విధానంలో జరగనున్న ఈ ప్రక్రియలో ప్రతి ఇంటిని, ప్రతి వ్యక్తిని చేర్చి వివరాలను నమోదు చేయాలని స్పష్టం చేశారు.

అలాగే, ప్రజల సహకారం కీలకమని పేర్కొంటూ అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలను చురుకుగా భాగస్వాములను చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గణాంక అధికారి వెంకటరమణ , మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జనాభా గణన–2027 సమర్థవంతంగా నిర్వహించాలి అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

Article Image

జనాభా గణన–2027 ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు, చార్జ్ అధికారులు మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సూచించారు.

మంగళవారం జరిగిన జనాభా గణన–సెన్సెస్ 2027కు సంబంధించిన చార్జ్ అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, గణనను రెండు దశల్లో సమగ్రంగా చేపట్టాలని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హౌస్ లిస్టింగ్‌ను కచ్చితంగా నిర్వహిస్తే సెన్సెస్ ప్రక్రియ సాఫీగా పూర్తవుతుందని అన్నారు. బ్లాక్ వారీగా ప్రణాళికలు రూపొందించి సులభతరంగా గణన చేపట్టాలని సూచించారు. ప్రతి దశను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

జనాభా గణన–2027లో పాల్గొనే సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ సమగ్ర సమాచార సేకరణపై దృష్టి పెట్టాలని అన్నారు. డిజిటల్ విధానంలో జరగనున్న ఈ ప్రక్రియలో ప్రతి ఇంటిని, ప్రతి వ్యక్తిని చేర్చి వివరాలను నమోదు చేయాలని స్పష్టం చేశారు.

అలాగే, ప్రజల సహకారం కీలకమని పేర్కొంటూ అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలను చురుకుగా భాగస్వాములను చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గణాంక అధికారి వెంకటరమణ , మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News