Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 17, 2026 09:25 PM

జనాభా గణన–2027 సమర్థవంతంగా నిర్వహించాలి అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

జనాభా గణన–2027 సమర్థవంతంగా నిర్వహించాలి అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

జనాభా గణన–2027 సమర్థవంతంగా నిర్వహించాలి అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
March 17, 2026 06:52 PM 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

జనాభా గణన–2027 ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు, చార్జ్ అధికారులు మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సూచించారు.

మంగళవారం జరిగిన జనాభా గణన–సెన్సెస్ 2027కు సంబంధించిన చార్జ్ అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, గణనను రెండు దశల్లో సమగ్రంగా చేపట్టాలని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హౌస్ లిస్టింగ్‌ను కచ్చితంగా నిర్వహిస్తే సెన్సెస్ ప్రక్రియ సాఫీగా పూర్తవుతుందని అన్నారు. బ్లాక్ వారీగా ప్రణాళికలు రూపొందించి సులభతరంగా గణన చేపట్టాలని సూచించారు. ప్రతి దశను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

జనాభా గణన–2027లో పాల్గొనే సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ సమగ్ర సమాచార సేకరణపై దృష్టి పెట్టాలని అన్నారు. డిజిటల్ విధానంలో జరగనున్న ఈ ప్రక్రియలో ప్రతి ఇంటిని, ప్రతి వ్యక్తిని చేర్చి వివరాలను నమోదు చేయాలని స్పష్టం చేశారు.

అలాగే, ప్రజల సహకారం కీలకమని పేర్కొంటూ అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలను చురుకుగా భాగస్వాములను చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గణాంక అధికారి వెంకటరమణ , మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News