Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 16, 2026 05:09 PM

జాలమంచి గ్రామంలో రైతులకు పీఎం కిసాన్ అవగాహన

జాలమంచి గ్రామంలో రైతులకు పీఎం కిసాన్ అవగాహన

జాలమంచి గ్రామంలో రైతులకు పీఎం కిసాన్ అవగాహన
March 16, 2026 02:28 PM 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆదోని తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు సూచనలతో జాలమంచి గ్రామంలో రైతులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో గ్రామంలోని రైతుల ఇళ్లకు స్వయంగా వెళ్లి అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాల కింద రైతుల ఖాతాల్లో జమ అయిన డబ్బుల గురించి వారికి తెలియజేశారు.

ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయని తెలిపారు. రైతులకు ఆర్థికంగా బలాన్ని అందించేందుకు పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయని పేర్కొన్నారు. రైతులు ప్రభుత్వ పథకాలపై పూర్తి అవగాహన కలిగి ఉండి అందుతున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, రంగస్వామి నాయుడు, ఉమ్మి సలీం, జిందేశంకర్, రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ డైరెక్టర్ రామకృష్ణ, రంగన్న, పట్టణ అధ్యక్షుడు తిమ్మప్ప, మండల అధ్యక్షులు శివప్ప, లక్ష్మీనారాయణ, మాజీ కౌన్సిలర్ అంజి, అయ్యన్న, గనేకల్ విరుపాక్షి, మాదిరి వీరేష్, బాబు నాయుడు, జగదీష్, జెసి బంగారయ్య, గిడ్డయ్య, సయ్యద్, సదుల్లా, షణ్ముఖ, వెంకటేష్, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. అలాగే గ్రామ నాయకులు గోవిందప్ప, బంగారయ్య, శరణప్ప, ఆంజనేయ, రామంజి, హుసేని, రంగస్వామి, చిదానంద, వెంకటేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News