PRINT TIME: May 26, 2026 08:32 PM
జింకలగూడెంలో నూతన మజీద్కు శంకుస్థాపన
జింకలగూడెంలో నూతన మజీద్కు శంకుస్థాపన
December 29, 2025 07:19 PM
67 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
చలికాలంలో గ్రామస్తులకు దుప్పట్ల పంపిణీ
ఖమ్మం స్థానికం ప్రతినిధి జనార్దన్ రావు:
తిరుమలాయపాలెం మండల పరిధిలోని జింకలగూడెం గ్రామంలో నూతన మజీద్ నిర్మాణానికి గ్రేటర్ ఇన్ఫ్రా చైర్మన్ సయ్యద్ ఇమాం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సయ్యద్ మదర్ సాబ్, మాదిరిపురం మదర్సా కరస్పాండెంట్ బాది ఉజ్జిమ పాల్గొన్నారు.
శంకుస్థాపన అనంతరం గోల్ తండా, జింకలగూడెం, గోపాయిగూడెం గ్రామాలకు చెందిన పేద ప్రజలకు చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం గోల్ తండా గ్రామపంచాయతీ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రేటర్ ఇన్ఫ్రా చైర్మన్ సయ్యద్ ఇమాం ను శాలువాతో సత్కరించారు. ప్రజాసేవ కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి