జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో చిట్యాల విద్యార్థులు
స్థానిక ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి
నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలోని ఆక్స్ఫర్డ్ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు జిల్లాస్థాయి అథ్లెటిక్ పోటీలకు ఎంపికయ్యారు. గత ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో జిల్లా స్థాయి అథ్లెటిక్ ఎంపిక పోటీలు జరిగాయి. అండర్- 10 విభాగంలో 300 మీటర్ల పరుగు పందెంలో నాలుగవ తరగతి విద్యార్థి సౌరవ్ మహాకుడ్, అండర్ -14 భాగంలో 60 మీటర్ల పరుగు పందెంలో 6వ తరగతి విద్యార్థిని చింతకాయల నిత్య, 400 మీటర్ల పరుగు పందెంలో 3వ తరగతి విద్యార్థి విక్రాంత్, అండర్ - 14 విభాగంలో 60 మీటర్ల లాంగ్ జంప్ లో 8వ తరగతి విద్యార్థి సాయి ప్రణీత్ లు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులు త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ పోటీలలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పాఠశాల వ్యవహర్త పెద్ది నరేందర్, వ్యాయామ ఉపాధ్యాయుడు కన్నెబోయిన లింగస్వామి, ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. రాష్ట్రస్థాయిలో జరిగే పోటీలలో ఉత్తమ ప్రతిభను కనబరిచి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని వారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి