PRINT TIME: May 31, 2026 01:00 AM
జై శ్రీరామ్ నినాదాలతో విజయవంతమైన హనుమాన్ చాలీసా కార్యక్రమం
జై శ్రీరామ్ నినాదాలతో విజయవంతమైన హనుమాన్ చాలీసా కార్యక్రమం
May 30, 2026 08:30 AM
69 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామ హనుమాన్ ఆలయంలో శనివారం విశ్వ హిందూ పరిషత్, బజరంగదళ్ ఆధ్వర్యంలో మూడవ వారంగా నిర్వహిస్తున్న హనుమాన్ చాలీసా కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. గ్రామ యువత, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని "జై శ్రీరామ్.. జై శ్రీరామ్" నినాదాలతో ఆలయ ప్రాంగణాన్ని మార్మోగించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రసాదం పంపిణీ చేయగా, మూడవ వారపు ప్రసాద దాతగా సేవలందించిన గ్రామానికి చెందిన చాకలి శేఖర్ను గ్రామ హిందూ సేవా సభ్యులు ప్రత్యేకంగా అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో ధార్మిక చైతన్యం, ఐక్యతను పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని పాల్గొన్న వారు ఆకాంక్షించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి