Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నియోజకవర్గ సమస్యల పరిష్కారమే లక్ష్యం – ముఖ్యమంత్రిని కలిసిన ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 31, 2026 01:00 AM

జై శ్రీరామ్ నినాదాలతో విజయవంతమైన హనుమాన్ చాలీసా కార్యక్రమం

జై శ్రీరామ్ నినాదాలతో విజయవంతమైన హనుమాన్ చాలీసా కార్యక్రమం

జై శ్రీరామ్ నినాదాలతో విజయవంతమైన హనుమాన్ చాలీసా కార్యక్రమం
May 30, 2026 08:30 AM 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామ హనుమాన్ ఆలయంలో శనివారం విశ్వ హిందూ పరిషత్, బజరంగదళ్ ఆధ్వర్యంలో మూడవ వారంగా నిర్వహిస్తున్న హనుమాన్ చాలీసా కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. గ్రామ యువత, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని "జై శ్రీరామ్.. జై శ్రీరామ్" నినాదాలతో ఆలయ ప్రాంగణాన్ని మార్మోగించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రసాదం పంపిణీ చేయగా, మూడవ వారపు ప్రసాద దాతగా సేవలందించిన గ్రామానికి చెందిన చాకలి శేఖర్‌ను గ్రామ హిందూ సేవా సభ్యులు ప్రత్యేకంగా అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో ధార్మిక చైతన్యం, ఐక్యతను పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని పాల్గొన్న వారు ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News