Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 03:58 AM

జహీరాబాద్ మండలంలో వివిధ గ్రామాలలో 50 లక్షల నిధులతో నూతన సీసీ రోడ్ల, డ్రైన్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ మండలంలో వివిధ గ్రామాలలో 50 లక్షల నిధులతో నూతన సీసీ రోడ్ల, డ్రైన్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ మండలంలో వివిధ గ్రామాలలో 50 లక్షల నిధులతో  నూతన సీసీ రోడ్ల, డ్రైన్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే మాణిక్ రావు
March 23, 2026 12:48 AM 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

జహీరాబాద్‌లో రూ.50 లక్షల పనులకు శ్రీకారం

జహీరాబాద్, : జహీరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో రూ.50 లక్షల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ పాల్గొన్నారు.గోవింద్‌పూర్ గ్రామంలో రూ.30 లక్షలతో పనులు (అండర్ డ్రైన్ జీపీ నిధులు రూ.25 లక్షలు, అదనంగా రూ.5 లక్షలు), రాయిపల్లి డి, హుగ్గెల్లి తండా, అల్గోల్, బుచినెల్లి గ్రామాల్లో ఒక్కో గ్రామానికి రూ.5 లక్షల చొప్పున అభివృద్ధి పనులు చేపట్టారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. రోడ్లు, తాగునీరు,

శంకుస్థాపన చేస్తున్న దృశ్యం

డ్రైనేజీవంటి సదుపాయాలను మెరుగుపరచేందుకు కృషి చేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో గోవింద్‌పూర్ సర్పంచ్ కవిత వెంకట్, రాయిపల్లి డి సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, హుగ్గెల్లి తండా సర్పంచ్ గేని బాయి, అల్గోల్ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, బుచినెల్లి సర్పంచ్ సునీత శ్రీనివాస్‌తో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News