జహీరాబాద్ మండలంలో వివిధ గ్రామాలలో 50 లక్షల నిధులతో నూతన సీసీ రోడ్ల, డ్రైన్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ మండలంలో వివిధ గ్రామాలలో 50 లక్షల నిధులతో నూతన సీసీ రోడ్ల, డ్రైన్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే మాణిక్ రావు
Reporter Sangameshwar Reddy
జహీరాబాద్లో రూ.50 లక్షల పనులకు శ్రీకారం
జహీరాబాద్, : జహీరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో రూ.50 లక్షల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ పాల్గొన్నారు.గోవింద్పూర్ గ్రామంలో రూ.30 లక్షలతో పనులు (అండర్ డ్రైన్ జీపీ నిధులు రూ.25 లక్షలు, అదనంగా రూ.5 లక్షలు), రాయిపల్లి డి, హుగ్గెల్లి తండా, అల్గోల్, బుచినెల్లి గ్రామాల్లో ఒక్కో గ్రామానికి రూ.5 లక్షల చొప్పున అభివృద్ధి పనులు చేపట్టారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. రోడ్లు, తాగునీరు,
శంకుస్థాపన చేస్తున్న దృశ్యం
డ్రైనేజీవంటి సదుపాయాలను మెరుగుపరచేందుకు కృషి చేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో గోవింద్పూర్ సర్పంచ్ కవిత వెంకట్, రాయిపల్లి డి సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, హుగ్గెల్లి తండా సర్పంచ్ గేని బాయి, అల్గోల్ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, బుచినెల్లి సర్పంచ్ సునీత శ్రీనివాస్తో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి