జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో గౌని రాజ్ కుమార్కు డా. ఉజ్వల్ రెడ్డి మద్దతు
జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో గౌని రాజ్ కుమార్కు డా. ఉజ్వల్ రెడ్డి మద్దతు
Krishna
జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డా. సిద్ధం ఉజ్వల్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 14వ వార్డు (హరిజన వార్డు) అభ్యర్థి గౌని రాజ్ కుమార్కు మద్దతుగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు.ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి హస్తం గుర్తును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టామని, మున్సిపాలిటీలో కూడా అభివృద్ధి పనులు మరింత వేగంగా కొనసాగుతాయని తెలిపారు.ఈ ప్రచార కార్యక్రమంలో సిడిసి చైర్మన్ ముబీన్, అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పట్లోళ్ళ నాగిరెడ్డి, సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, కాశీనాథ్, రవి, పవన్, ముజాఫర్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి