Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 12:25 AM

జగిత్యాలలో 2 సెకన్ల పాటు భూమి కంపనం.. ఒక్కసారిగా బయటకు పరుగులు తీసిన ప్రజలు

జగిత్యాలలో 2 సెకన్ల పాటు భూమి కంపనం.. ఒక్కసారిగా బయటకు పరుగులు తీసిన ప్రజలు

జగిత్యాలలో 2 సెకన్ల పాటు భూమి కంపనం.. ఒక్కసారిగా బయటకు పరుగులు తీసిన ప్రజలు
09-03-2026 81 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జగిత్యాల జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం స్వల్ప భూకంపం సంభవించి స్థానిక ప్రజల్లో కొంతసేపు భయాందోళన నెలకొంది. జిల్లా పరిధిలోని కథలాపూర్ మండలంలో మధ్యాహ్నం సుమారు 12:45 గంటల సమయంలో భూమి సుమారు 2 సెకన్ల పాటు కంపించినట్లు స్థానికులు తెలిపారు.భూమి కంపించిన సమయంలో పెద్ద శబ్దం కూడా వినిపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయపడిపోయారు.ఏమి జరుగుతుందో అర్థం కాక ప్రజలు వెంటనే తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొంతసేపు గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరిగినట్లు ఇప్పటివరకు సమాచారం లేదు.భూకంపం తీవ్రత ఎంతగా ఉంది? దానికి గల కారణాలు ఏమిటి? అనే విషయాలపై అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సంబంధిత అధికారులు పరిస్థితిని పరిశీలించి పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు సమాచారం.

Sthanikam

జగిత్యాలలో 2 సెకన్ల పాటు భూమి కంపనం.. ఒక్కసారిగా బయటకు పరుగులు తీసిన ప్రజలు

Article Image

జగిత్యాల జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం స్వల్ప భూకంపం సంభవించి స్థానిక ప్రజల్లో కొంతసేపు భయాందోళన నెలకొంది. జిల్లా పరిధిలోని కథలాపూర్ మండలంలో మధ్యాహ్నం సుమారు 12:45 గంటల సమయంలో భూమి సుమారు 2 సెకన్ల పాటు కంపించినట్లు స్థానికులు తెలిపారు.భూమి కంపించిన సమయంలో పెద్ద శబ్దం కూడా వినిపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయపడిపోయారు.ఏమి జరుగుతుందో అర్థం కాక ప్రజలు వెంటనే తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొంతసేపు గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరిగినట్లు ఇప్పటివరకు సమాచారం లేదు.భూకంపం తీవ్రత ఎంతగా ఉంది? దానికి గల కారణాలు ఏమిటి? అనే విషయాలపై అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సంబంధిత అధికారులు పరిస్థితిని పరిశీలించి పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు సమాచారం.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News