PRINT TIME: June 22, 2026 12:54 PM
జగ్జీవన్కు బదిలీ.. కొత్త కమిషనర్గా వి. ప్రశాంతి రాక
జగ్జీవన్కు బదిలీ.. కొత్త కమిషనర్గా వి. ప్రశాంతి రాక
May 01, 2026 03:46 PM
131 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ మున్సిపల్ కమిషనర్గా గత రెండు సంవత్సరాలుగా సేవలందించిన జగ్జీవన్ బదిలీపై ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి వెళ్లారు. బదిలీ సందర్భంగా ఆయన నారాయణఖేడ్ మున్సిపల్ మేనేజర్ వెంకటశివయ్యకు బాధ్యతలను అప్పగించి రిలీవ్ అయ్యారు. ఇదే సమయంలో గ్రూప్-1 పరీక్షలో ఉత్తీర్ణత సాధించి శిక్షణ పూర్తి చేసుకున్న వి. ప్రశాంతి నారాయణఖేడ్ కొత్త మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఇన్చార్జ్ మున్సిపల్ కమిషనర్ వెంకటశివయ్య తెలిపారు. జగ్జీవన్ సేవలను మున్సిపల్ సిబ్బంది అభినందించగా, నూతన కమిషనర్ రాకతో మున్సిపల్ పరిపాలన మరింత మెరుగుపడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి