చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి
వెంకటాపురం గ్రామానికి చెందిన విద్యార్థి అఖిల్ అండర్–19 విభాగంలో జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపిక కావడం గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు జెర్రిపోతుల సత్యనారాయణ అఖిల్ను ఘనంగా అభినందించారు.
అఖిల్ భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ, జాతీయ స్థాయి పోటీలకు హాజరయ్యే ప్రయాణ ఖర్చుల నిమిత్తం ఆయనకు రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు.
గ్రామస్థులు, క్రీడాభిమానులు అఖిల్కు శుభాకాంక్షలు తెలుపుతూ, రాష్ట్రం తరఫున మెరుగైన ప్రదర్శన కనబరచాలని ఆకాంక్షించారు.
“ఆల్ ది బెస్ట్ అఖిల్” అంటూ పలువురు అభినందనలు తెలియజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి