Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోచమ్మ దేవాలయం నిర్మాణానికి నాటకమండలి సభ్యుల విరాళం ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 15, 2026 11:11 PM

ఇంటర్‌లో ప్రతిభ చూపిన ప్రభుత్వ విద్యార్థులకు శుభాకాంక్షలు

ఇంటర్‌లో ప్రతిభ చూపిన ప్రభుత్వ విద్యార్థులకు శుభాకాంక్షలు

ఇంటర్‌లో ప్రతిభ చూపిన ప్రభుత్వ విద్యార్థులకు శుభాకాంక్షలు
April 15, 2026 05:42 PM 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది తెలిపారు.

సోమవారం కళాశాలలో మౌలిక వసతులపై జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి భాను నాయక్‌తో కలిసి ప్రిన్సిపాల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ కళాశాలకు అవసరమైన నిధులు మంజూరు చేయించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు.

తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, గదుల్లో విద్యుత్ సరఫరా, ఫ్యాన్లు, భవనాలు, బెంచీలు, ఫర్నీచర్ తదితర అవసరాల జాబితాను సిద్ధం చేసి అందజేయాలని సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే ఉచితంగా నాణ్యమైన ఇంటర్మీడియట్ విద్య అందుతుందని, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ఆధునిక లాబొరేటరీలతో విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారని తెలిపారు.

ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో తాటి ఉదయశ్రీ 980/1000, ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ ఎల్ఎండీటీ దరావత్ సరిత 984/1000, ప్రథమ సంవత్సరంలో బైపిసి జనగాం శ్రీకర్ 431/440, హెచ్‌ఈసీ అమతుల్ రకుల్ షరియా 465/500 మార్కులు సాధించడంతో ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పెరుమళ్ల యాదయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు కొనతం రాజేష్ రెడ్డి, కొండపల్లి దిలీప్ రెడ్డి, గుణగంటి హేమ సతీష్, లెక్చరర్లు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News