Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:30 AM

ఇసుక సరఫరా పూర్తిగా ఆన్‌లైన్‌లోనే అక్రమ రవాణాపై కఠిన చర్యలు: కలెక్టర్

ఇసుక సరఫరా పూర్తిగా ఆన్‌లైన్‌లోనే అక్రమ రవాణాపై కఠిన చర్యలు: కలెక్టర్

ఇసుక సరఫరా పూర్తిగా ఆన్‌లైన్‌లోనే అక్రమ రవాణాపై కఠిన చర్యలు: కలెక్టర్
24-03-2026 59 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జిల్లాలో ఇసుక సరఫరాను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులకు సూచించారు.

మంగళవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్, ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్‌తో కలిసి ఇసుక సరఫరా, వినియోగం, నిల్వలు, రవాణాపై సాండ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి, మైనింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల అవసరాలు, ప్రభుత్వ పనుల కోసం అవసరమైన ఇసుకను పూర్తిగా ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇసుక రీచ్‌ల వద్ద నియమ నిబంధనలు కచ్చితంగా పాటించడంతో పాటు అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని సూచించారు.

ప్రజలకు పారదర్శకంగా ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇసుక నిర్వహణలో మరింత సమర్థత సాధించాలని తెలిపారు.

ఈ సమావేశంలో ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ మైనింగ్ రవికుమార్, ఇరిగేషన్ ఎస్ఈ రవీందర్, జిల్లా రవాణా అధికారి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ఇసుక సరఫరా పూర్తిగా ఆన్‌లైన్‌లోనే అక్రమ రవాణాపై కఠిన చర్యలు: కలెక్టర్

Article Image

జిల్లాలో ఇసుక సరఫరాను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులకు సూచించారు.

మంగళవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్, ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్‌తో కలిసి ఇసుక సరఫరా, వినియోగం, నిల్వలు, రవాణాపై సాండ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి, మైనింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల అవసరాలు, ప్రభుత్వ పనుల కోసం అవసరమైన ఇసుకను పూర్తిగా ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇసుక రీచ్‌ల వద్ద నియమ నిబంధనలు కచ్చితంగా పాటించడంతో పాటు అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని సూచించారు.

ప్రజలకు పారదర్శకంగా ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇసుక నిర్వహణలో మరింత సమర్థత సాధించాలని తెలిపారు.

ఈ సమావేశంలో ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ మైనింగ్ రవికుమార్, ఇరిగేషన్ ఎస్ఈ రవీందర్, జిల్లా రవాణా అధికారి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News