ఇసుక సరఫరా పూర్తిగా ఆన్లైన్లోనే అక్రమ రవాణాపై కఠిన చర్యలు: కలెక్టర్
ఇసుక సరఫరా పూర్తిగా ఆన్లైన్లోనే అక్రమ రవాణాపై కఠిన చర్యలు: కలెక్టర్
Editor Desk
జిల్లాలో ఇసుక సరఫరాను పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులకు సూచించారు.
మంగళవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్, ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్తో కలిసి ఇసుక సరఫరా, వినియోగం, నిల్వలు, రవాణాపై సాండ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి, మైనింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల అవసరాలు, ప్రభుత్వ పనుల కోసం అవసరమైన ఇసుకను పూర్తిగా ఆన్లైన్ బుకింగ్ ద్వారా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇసుక రీచ్ల వద్ద నియమ నిబంధనలు కచ్చితంగా పాటించడంతో పాటు అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని సూచించారు.
ప్రజలకు పారదర్శకంగా ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇసుక నిర్వహణలో మరింత సమర్థత సాధించాలని తెలిపారు.
ఈ సమావేశంలో ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ మైనింగ్ రవికుమార్, ఇరిగేషన్ ఎస్ఈ రవీందర్, జిల్లా రవాణా అధికారి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి