ఇస్కిల్లలో ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం
ఇస్కిల్లలో ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని ఇస్కిల్ల గ్రామంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామమంతా భక్తి పరవశంతో నిండిపోగా, స్వామివారికి ప్రత్యేక పూజలు, వేద మంత్రోచ్చారణల నడుమ కళ్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి.
స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు పరిసర గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ మహోత్సవంలో గ్రామ సర్పంచ్ పైళ్ల చందన వెంకటరెడ్డి అన్నప్రసాద వితరణ చేపట్టి భక్తుల ప్రశంసలు అందుకున్నారు. భక్తులకు స్వయంగా సేవలు అందిస్తూ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో రాపర్తి గణేష్, పిండి మల్లేష్, ఉపేంద్ర చారి, మాధవరెడ్డి, సత్యనారాయణ, సంజీవ, అశోక్ రెడ్డి, శశ్వంత్ రెడ్డి, నర్సిరెడ్డి, రాపర్తి రవి, సాయికుమార్, పరశురాములు, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు కూడా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి