Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:02 AM

ఇస్కిల్లలో ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం

ఇస్కిల్లలో ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం

ఇస్కిల్లలో ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం
27-03-2026 508 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని ఇస్కిల్ల గ్రామంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామమంతా భక్తి పరవశంతో నిండిపోగా, స్వామివారికి ప్రత్యేక పూజలు, వేద మంత్రోచ్చారణల నడుమ కళ్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి.

స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు పరిసర గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

ఈ మహోత్సవంలో గ్రామ సర్పంచ్ పైళ్ల చందన వెంకటరెడ్డి అన్నప్రసాద వితరణ చేపట్టి భక్తుల ప్రశంసలు అందుకున్నారు. భక్తులకు స్వయంగా సేవలు అందిస్తూ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో రాపర్తి గణేష్, పిండి మల్లేష్, ఉపేంద్ర చారి, మాధవరెడ్డి, సత్యనారాయణ, సంజీవ, అశోక్ రెడ్డి, శశ్వంత్ రెడ్డి, నర్సిరెడ్డి, రాపర్తి రవి, సాయికుమార్, పరశురాములు, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు కూడా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

ఇస్కిల్లలో ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని ఇస్కిల్ల గ్రామంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామమంతా భక్తి పరవశంతో నిండిపోగా, స్వామివారికి ప్రత్యేక పూజలు, వేద మంత్రోచ్చారణల నడుమ కళ్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి.

స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు పరిసర గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

ఈ మహోత్సవంలో గ్రామ సర్పంచ్ పైళ్ల చందన వెంకటరెడ్డి అన్నప్రసాద వితరణ చేపట్టి భక్తుల ప్రశంసలు అందుకున్నారు. భక్తులకు స్వయంగా సేవలు అందిస్తూ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో రాపర్తి గణేష్, పిండి మల్లేష్, ఉపేంద్ర చారి, మాధవరెడ్డి, సత్యనారాయణ, సంజీవ, అశోక్ రెడ్డి, శశ్వంత్ రెడ్డి, నర్సిరెడ్డి, రాపర్తి రవి, సాయికుమార్, పరశురాములు, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు కూడా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News