ఇస్కిల్లలో ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం
ఇస్కిల్లలో ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని ఇస్కిల్ల గ్రామంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామమంతా భక్తి పరవశంతో నిండిపోగా, స్వామివారికి ప్రత్యేక పూజలు, వేద మంత్రోచ్చారణల మధ్య కళ్యాణ వేడుకలు భక్తుల మధ్య ఘనంగా సాగాయి.
స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు పరిసర గ్రామాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.
ఈ మహోత్సవాన్ని స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు రాపర్తి గణేష్, పిండి మల్లేష్, ఉపేంద్ర చారి, మాధవరెడ్డి, సత్యనారాయణ, సంజీవ, అశోక్ రెడ్డి, శశ్వంత్ రెడ్డి, నర్సిరెడ్డి, రాపర్తి రవి, సాయికుమార్, పరశురాములు, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు కూడా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి