ఇఫ్తార్ విందుతో మతసామరస్యానికి నిదర్శనం. ఎస్ఐ డి నాగరాజు
ఇఫ్తార్ విందుతో మతసామరస్యానికి నిదర్శనం. ఎస్ఐ డి నాగరాజు
స్థానికం బృందం
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం అభినందనీయమని రామన్నపేట ఎస్ ఐ డి. నాగరాజు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని నాగార్జున స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
పాఠశాల కరస్పాండెంట్ డా. నకిరేకంటి నాగరాజు, ప్రిన్సిపాల్ రేఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ ఐ నాగరాజు మతసామరస్యానికి ప్రతీకగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసి, ఉపవాస దీక్షలో ఉన్నవారితో కలిసి ఇఫ్తార్లో పాల్గొన్నారు.
అనంతరం ఉత్తమ పోలీస్ అవార్డు అందుకున్న కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్ను శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సురేందర్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఏటెల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎండి జమ్మిరుద్దీన్, నాయకులు ఎం.డి. అక్రమ్, ఎండి వహీద్, ఎస్కే చాంద్, ఎండి అన్వర్, చాంద్ పాషా, షేక్ ఫిరోజ్ పాషా, ఆరిఫ్, అంజాద్ తదితరులతో పాటు పాఠశాల అధ్యాపకులు విజయశ్రీ, వినీషా, స్వప్న, మీర్జా అక్రమ్, నరసింహ, బొడ్డు బిక్షపతి, సంధ్య పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి