Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 03:58 AM

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి హత్య చేసిన భార్య
March 09, 2026 08:33 PM 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఖమ్మం పట్టణంలోని గాంధీనగర్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో బాధపడుతున్న భర్తను కారుతో ఢీకొట్టించి హత్య చేయించిన ఘటన సంచలనం రేపింది.

గాంధీనగర్‌కు చెందిన చాగంటి రవి, ప్రశాంతి దంపతులకు సుమారు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రవి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ మద్యానికి బానిసై అనారోగ్యానికి గురయ్యాడు. భర్త ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుండటంతో త్వరలో మరణిస్తాడని భావించిన ప్రశాంతి, గత జూలై నెలలో అతని పేరుతో రూ.66 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ చేయించింది.

అయితే నెలలు గడిచినా రవి మరణించకపోవడంతో డబ్బులు త్వరగా పొందాలనే ఉద్దేశంతో ప్రశాంతి పన్నాగం పన్నినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 2న రవికి మద్యం తాగించి, తన బావమరిది శ్రీనివాస్ సహాయంతో కారుతో ఢీకొట్టించి హత్య చేయించినట్లు వెల్లడైంది.

రవి మృతిపై అనుమానం కలిగిన పోలీసులు ప్రశాంతిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసి ప్రశాంతి, శ్రీనివాస్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ ఘటన ఖమ్మం పట్టణంలో తీవ్ర సంచలనం రేపింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News