Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:34 AM

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి హత్య చేసిన భార్య
09-03-2026 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఖమ్మం పట్టణంలోని గాంధీనగర్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో బాధపడుతున్న భర్తను కారుతో ఢీకొట్టించి హత్య చేయించిన ఘటన సంచలనం రేపింది.

గాంధీనగర్‌కు చెందిన చాగంటి రవి, ప్రశాంతి దంపతులకు సుమారు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రవి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ మద్యానికి బానిసై అనారోగ్యానికి గురయ్యాడు. భర్త ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుండటంతో త్వరలో మరణిస్తాడని భావించిన ప్రశాంతి, గత జూలై నెలలో అతని పేరుతో రూ.66 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ చేయించింది.

అయితే నెలలు గడిచినా రవి మరణించకపోవడంతో డబ్బులు త్వరగా పొందాలనే ఉద్దేశంతో ప్రశాంతి పన్నాగం పన్నినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 2న రవికి మద్యం తాగించి, తన బావమరిది శ్రీనివాస్ సహాయంతో కారుతో ఢీకొట్టించి హత్య చేయించినట్లు వెల్లడైంది.

రవి మృతిపై అనుమానం కలిగిన పోలీసులు ప్రశాంతిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసి ప్రశాంతి, శ్రీనివాస్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ ఘటన ఖమ్మం పట్టణంలో తీవ్ర సంచలనం రేపింది.

Sthanikam

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి హత్య చేసిన భార్య

Article Image

ఖమ్మం పట్టణంలోని గాంధీనగర్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో బాధపడుతున్న భర్తను కారుతో ఢీకొట్టించి హత్య చేయించిన ఘటన సంచలనం రేపింది.

గాంధీనగర్‌కు చెందిన చాగంటి రవి, ప్రశాంతి దంపతులకు సుమారు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రవి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ మద్యానికి బానిసై అనారోగ్యానికి గురయ్యాడు. భర్త ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుండటంతో త్వరలో మరణిస్తాడని భావించిన ప్రశాంతి, గత జూలై నెలలో అతని పేరుతో రూ.66 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ చేయించింది.

అయితే నెలలు గడిచినా రవి మరణించకపోవడంతో డబ్బులు త్వరగా పొందాలనే ఉద్దేశంతో ప్రశాంతి పన్నాగం పన్నినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 2న రవికి మద్యం తాగించి, తన బావమరిది శ్రీనివాస్ సహాయంతో కారుతో ఢీకొట్టించి హత్య చేయించినట్లు వెల్లడైంది.

రవి మృతిపై అనుమానం కలిగిన పోలీసులు ప్రశాంతిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసి ప్రశాంతి, శ్రీనివాస్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ ఘటన ఖమ్మం పట్టణంలో తీవ్ర సంచలనం రేపింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News