యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు
స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్
యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల పరిధిలోని నర్సాపూర్ గ్రామంలో సోమవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు లబ్ధిదారులను కలిసి
గ్రామంలో స్లాబ్ దశ వరకు పూర్తి అయిన ఇందిరమ్మ ఇంటి పనులను పరిశీలించారు. ఇటుక,ఇసుక,ఎంత రేటుకి కొనుగోలు చేశారు. అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.మేస్త్రీకి ఇంటి నిర్మాణానికి ఎంత రేటు మాట్లాడారు అడిగి తెలుసుకున్నారు.స్లాబ్ వరకు 3 దశలో బిల్లులు వచ్చాయా అని లబ్ధిదారులను అడిగారు. మిగిలిన పనులు కూడా త్వరగా పూర్తి చేస్తే ఫైనల్ బిల్లు కూడా మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. మీదే ఆలస్యం త్వరగా మిగిలిన పనులు పూర్తి చేసి గృహప్రవేశం చేసుకోవాలి అని అన్నారు.గ్రామంలో కొత్తగా పాలకవర్గాలు ఏర్పాటు అయ్యాయి కాబట్టి గ్రామంలో ఒకసారి శానిటేషన్ పనులను చేయించాలి. రోజు ఒక వార్డు చొప్పున గ్రామం మొత్తం పారిశుద్ధ్య పనులకు చేయించాలని అన్నారు.మీ గ్రామంలో ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి కూడా చర్యలు తీసుకోవాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి