Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 08:05 AM

ఇందూర్ గ్రామానికి చెందిన మహిళ అదృశ్యం

ఇందూర్ గ్రామానికి చెందిన మహిళ అదృశ్యం

ఇందూర్ గ్రామానికి చెందిన మహిళ అదృశ్యం
January 13, 2026 11:44 AM 844 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sangareddy & Manoor
Sthanikam District Staff Reporter krishna

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:రాయికోడ్ మండలం ఇందూర్ గ్రామానికి చెందిన లలిత (వయస్సు 45) అనారోగ్య కారణంగా భర్త మాణిక్యం మూడు సంవత్సరాల క్రితం మృతి చెందడంతో, తన కుమారులు నాగారం బాల్ రాజు (వయస్సు 25), నాగారం రజనీకాంత్, నాగారం రాజేశ్‌లతో కలిసి నివసిస్తూ జీవనం కొనసాగిస్తోంది. ఈ కుటుంబం యస్.సి (మాదిగ) కులానికి చెందినది కాగా, వృత్తిగా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తోంది.తేదీ 08.01.2026 (గురువారం) నాడు ఉదయం 8.00 గంటలకు నాగారం బాల్ రాజు తన ఇంటి నుంచి పొలానికి వెళ్లి సాయంత్రం 6.00 గంటలకు ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చిన సమయంలో అతని తల్లి లలిత ఇంటివద్ద కనిపించలేదు. ఆ సమయంలో ఇంటిలో తమ్ముడు రాజేశ్ మాత్రమే ఉన్నాడు.తల్లి గురించి విచారించగా, రాజేశ్ తెలిపిన వివరాల ప్రకారం అతను ఉదయం 9.00 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి మధ్యాహ్నం 2.00 గంటలకు తిరిగి ఇంటికి వచ్చేసరికి తల్లి ఇంటివద్ద లేకపోయిందని చెప్పాడు.ఇంకా విచారణ చేయగా, ఇంటి పక్కన నివసిస్తున్న మునిపల్లి రాణమ్మ తెలిపిన వివరాల ప్రకారం, లలిత ఉదయం సుమారు 10.00 గంటల సమయంలో ఇంటి నుంచి నడుచుకుంటూ కర్చల్ గ్రామం వైపు వెళ్లినట్లు తెలిసింది. అప్పటి నుంచి ఆమె ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

మీ స్పందన? 4 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News