Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 02:39 PM

ఇందిరమ్మ రాజ్యం పేదల ఇల్లు కూల్చడమేనా..?

ఇందిరమ్మ రాజ్యం పేదల ఇల్లు కూల్చడమేనా..?

ఇందిరమ్మ రాజ్యం పేదల ఇల్లు కూల్చడమేనా..?
February 28, 2026 06:43 PM 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

వెలుగుమట్ల భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి – అదే స్థలంలో ఇళ్లు నిర్మించాలి

తిరుమలాయపాలెం మండల కేంద్రంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

ఖమ్మం పట్టణంలోని వెలుగుమట్ల ప్రాంతంలో భూదాన భూమిలో నివసిస్తున్న పేదల ఇళ్లను కూల్చివేయడాన్ని నిరసిస్తూ సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు ఆందోళన చేపట్టారు. ముందస్తు హెచ్చరికలు, నోటీసులు ఇవ్వకుండా ఈ నెల 24వ తేదీ తెల్లవారుజామున యంత్రాలతో ఇళ్లను నేలమట్టం చేశారని ఆరోపించారు.ఈ ఘటనకు నిరసనగా తిరుమలాయపాలెం మండల కేంద్రంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి గొర్రెపాటి రమేష్ మాట్లాడుతూ పేద ప్రజలను బలవంతంగా స్థలాల నుంచి వెళ్లగొట్టడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించి ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబానికి ఒక లక్ష రూపాయలు ఇవ్వడంతో పాటు, అదే స్థలంలో రెండు పడకగదుల ఇళ్లు నిర్మించాలని కోరారు.

పేదలపై దుర్మార్గంగా చర్యలు తీసుకోవడం ఆప్రజాస్వామికమని, నిర్వాసితులకు న్యాయం చేయకపోతే దశలవారీగా ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పోలేపొంగు నాగయ్య, వీరాస్వామి, నగేష్, బింగి శ్రీను, రామకృష్ణ, సుధా, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News