ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్
ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నాగల్గిద్దా మండలం కేశ్వర్ గ్రామపంచాయతీకి చెందిన మొహమ్మద్ పాషా నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ ముఖ్య అతిథిగా పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. కొత్త ఇంటిలో మొహమ్మద్ పాషా కుటుంబం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాగల్గిద్దా మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాణిక్ రావు పటేల్, సర్పంచ్ ములిగే మహదేవి, ఉపసర్పంచ్ వాహబ్ పటేల్, కోటలే రాజు, సంజీవ్ కుమార్, స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి