Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం – మనువాద సిద్ధాంతాన్ని ఎదుర్కొందాం: కోమటిరెడ్డి చంద్రారెడ్డి వాట్సాప్‌లో భూ నమోదు సేవలు ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 12, 2026 05:07 PM

ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం

ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం

ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం
April 12, 2026 03:17 PM 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అర్హులందరికీ దశలవారీగా ఇళ్ల మంజూరు: రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

పేదలకు సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఛివ్వేంల మండలంలోని గుంజలూరు గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు ధారావత్ వీరన్న నాయక్‌తో కలిసి లబ్ధిదారులు మొలుగురి ప్రభావతి, ప్రభాకర్‌ల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇండ్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ పేదల సంక్షేమం కోసం కృషి చేస్తోందని పేర్కొన్నారు.

గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పేరుతో పేదలను పదేళ్లు ఊరించిందని విమర్శించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున మంజూరు చేసిందని గుర్తుచేశారు. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఇళ్లను మంజూరు చేస్తూ ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల నెరవేర్చుతామని తెలిపారు.

“ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల నెరవేరుతోంది. పేదల ముఖంలో చిరునవ్వు చూడటమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం” అని అన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి లబ్ధి చేకూర్చడమే లక్ష్యమని, రానున్న రోజుల్లో మరింత మంది పేదలకు ఇళ్లు అందజేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో గుంజలూరు సర్పంచ్ బొల్లికొండ సైదులు, ఉప సర్పంచ్ దొనకొండ పావని మహేష్, వార్డ్ సభ్యులు కొప్పు సైదులు, కొనకంచి మల్లయ్య, పెదపోలు చందన, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ అమరారపు శ్రీనివాస్, పిసిసి ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ చింతమళ్ల రమేష్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలిమినేటి అభినయ్, మండల పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు యండి అంజాద్ అలి, మున్సిపల్ కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News