ఇందిరమ్మ ఇళ్లతో పేద కుటుంబాలకు భరోసా: సంజీవరెడ్డి
ఇందిరమ్మ ఇళ్లతో పేద కుటుంబాలకు భరోసా: సంజీవరెడ్డి
Krishna
నాగల్గిద్దా మండల పరిధిలోని మావినెల్లి గ్రామంలో గ్రామానికి చెందిన రహిమ కుటుంబానికి మంజూరైన నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ వేడుకలు పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించగా, నారాయణఖేడ్ శాసనసభ్యుడు డాక్టర్ పి సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కత్తిరించి గృహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అండగా ఉంటామని తెలిపారు. ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉండి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి అర్హుడికి గృహ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. నూతన గృహంలోకి ప్రవేశించిన రహిమ కుటుంబ సభ్యులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కుటుంబం ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శివకుమార్, మాజీ అధ్యక్షుడు శ్రీకాంత్, మనోహర్ పాటిల్, మాజీ సర్పంచ్ బస్వరాజు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి