PRINT TIME: March 28, 2026 05:32 PM
ఇందిరమ్మ ఇళ్లలో సత్యనారాయణ వ్రతం పాల్గొన్న జిల్లా నాయకుడు పూస బాలకిషన్
ఇందిరమ్మ ఇళ్లలో సత్యనారాయణ వ్రతం పాల్గొన్న జిల్లా నాయకుడు పూస బాలకిషన్
March 28, 2026 01:40 PM
174 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట: ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మితమైన గృహంలో శనివారం భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన కేస వెంకటేశం స్వగృహంలో జరిగిన ఈ వ్రతంలో జిల్లా నాయకుడు పూస బాలకిషన్ పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వ్రతంలో పాల్గొన్న ఆయన తీర్థప్రసాదాలు స్వీకరించి, గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు. పేదల సొంతింటి కలను నెరవేర్చిన ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల ద్వారా లబ్ధి పొందిన కేస వెంకటేశం కుటుంబ సభ్యులు, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మరియు జిల్లా నాయకుడు పూస బాలకిషన్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి