ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై సమీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై సమీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి
Krishna
తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిపై జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన నిరుపేదలకు ప్రాధాన్యత క్రమంలో ఇళ్లు కేటాయించాలని ఎమ్మెల్యే కోరారు. పెండింగ్లో ఉన్న గృహ నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని, ఇళ్ల నిర్మాణానికి ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని, నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ప్రతి అర్హుడికి పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సమావేశంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి