రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం లో స్థానిక జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సమ్మర్ క్యాంప్లో భాగంగా ఉచిత కరాటే శిక్షణ తరగతులను సర్పంచ్ గర్దాస్ విక్రమ్ ప్రారంభించారు . అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలోని యువతీ యువకులు, బాలురు, బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కరాటే శిక్షణ పొందాలని సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ సూచించారు.
కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, ఈర్లపల్లి మల్లయ్య, మర్రి మహేష్, గర్ధాస్ శ్రీకాంత్, గర్ధాస్ సాయి, ఈర్లపల్లి కృష్ణ, ఈర్లపల్లి రమేష్, కరాటే మాస్టర్ అప్పం చెన్నకేశ్వర్, తెల్లం ప్రసాద్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి