Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:07 AM

ఇంద్రపాలనగరంలో న్యాయ విజ్ఞాన సదస్సు

ఇంద్రపాలనగరంలో న్యాయ విజ్ఞాన సదస్సు

ఇంద్రపాలనగరంలో న్యాయ విజ్ఞాన సదస్సు
25-04-2026 286 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట

ఇంద్రపాలనగరం గ్రామంలో మండల న్యాయ సేవా అధికార సంస్థ, మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి సరిత, ప్రిన్సిపల్ జడ్జి శిరీష, సీపీడీఓ సమీరా పాల్గొన్నారు.

గ్రామ ప్రజలకు బాల్యవివాహాల వల్ల కలిగే నష్టాలు, భవిష్యత్తులో తలెత్తే ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు చట్టవిరుద్ధమని, వాటికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోక్సో చట్టం కింద నమోదయ్యే కేసులు, శిక్షలపై అంగన్వాడీ, ఆశా వర్కర్లకు వివరించి, సమాజంలో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.

అవుట్‌రీచ్ సంస్థ ప్రతినిధి భాగ్యలక్ష్మి మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలు, చికిత్సా సదుపాయాలపై వివరించారు.

గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్, ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, పంచాయతీ కార్యదర్శి రసూల్, అంగన్వాడీ సిబ్బంది, ఎంఎల్‌హెచ్‌పీ జ్యోతి, ఆశా వర్కర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ప్యానెల్ సభ్యులు మామిడి వెంకట్‌రెడ్డి, డేవిడ్, వార్డ్ సభ్యులు వడ్లకొండ లక్ష్మి, పుట్టల లక్ష్మమ్మ ముత్యాలు, అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Sthanikam

ఇంద్రపాలనగరంలో న్యాయ విజ్ఞాన సదస్సు

Article Image

రామన్నపేట

ఇంద్రపాలనగరం గ్రామంలో మండల న్యాయ సేవా అధికార సంస్థ, మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి సరిత, ప్రిన్సిపల్ జడ్జి శిరీష, సీపీడీఓ సమీరా పాల్గొన్నారు.

గ్రామ ప్రజలకు బాల్యవివాహాల వల్ల కలిగే నష్టాలు, భవిష్యత్తులో తలెత్తే ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు చట్టవిరుద్ధమని, వాటికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోక్సో చట్టం కింద నమోదయ్యే కేసులు, శిక్షలపై అంగన్వాడీ, ఆశా వర్కర్లకు వివరించి, సమాజంలో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.

అవుట్‌రీచ్ సంస్థ ప్రతినిధి భాగ్యలక్ష్మి మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలు, చికిత్సా సదుపాయాలపై వివరించారు.

గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్, ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, పంచాయతీ కార్యదర్శి రసూల్, అంగన్వాడీ సిబ్బంది, ఎంఎల్‌హెచ్‌పీ జ్యోతి, ఆశా వర్కర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ప్యానెల్ సభ్యులు మామిడి వెంకట్‌రెడ్డి, డేవిడ్, వార్డ్ సభ్యులు వడ్లకొండ లక్ష్మి, పుట్టల లక్ష్మమ్మ ముత్యాలు, అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News