Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 01:03 PM

హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం: మంత్రి దామోదర్ రాజనర్సింహ

హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం: మంత్రి దామోదర్ రాజనర్సింహ

హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం: మంత్రి దామోదర్ రాజనర్సింహ
May 05, 2026 08:59 PM 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించనున్న చిత్రపురి ఫిల్మ్ ఫెస్టివల్‌కు సంబంధించిన వాల్ పోస్టర్‌ను సంగారెడ్డిలోని తన నివాసంలో మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ ఇప్పటికే ఫార్మా, ఐటీ హబ్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నగర అభివృద్ధి మరింత వేగంగా కొనసాగుతోందన్నారు. మెడికల్ టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని, మిడిల్ ఈస్ట్, యూరప్, ఆఫ్రికా తదితర దేశాల నుంచి అనేక మంది వైద్య సేవల కోసం హైదరాబాద్‌కు వస్తున్నారని తెలిపారు. ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు హైదరాబాద్ వేదికగా నిలవాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, దేశంలోనే అతిపెద్ద ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించడం గర్వకారణమన్నారు. సినిమా, ఓటిటి, యూట్యూబ్, సామాజిక మాధ్యమాల్లో ప్రభావం చూపే ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొననున్నారని చెప్పారు. ఈ ఫెస్టివల్‌లో 43 దేశాల నుంచి ప్రతినిధులు, దేశంలోని 8 రాష్ట్రాల నుంచి ఫిల్మ్ మేకర్స్ హాజరవుతారని నిర్వాహకులు వెల్లడించారు. ఇలాంటి కార్యక్రమాలు హైదరాబాద్ ప్రతిష్టను మరింత పెంచుతాయని మంత్రి పేర్కొంటూ ఫెస్టివల్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News