హైదరాబాద్లో భారత రాజ్యాంగ నిర్మాత, సంఘసంస్కర్త, ఆర్థికవేత్త, న్యాయవాది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు.
అంటరానితనం, కులవివక్షకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడి, దేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం కృషి చేసిన మహనీయుడైన అంబేద్కర్ సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు కొండేటి మల్లయ్య పాల్గొని అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి