Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హరీష్ రావును కలిసిన ఉద్యమ నేత ఎస్.కె. చాంద్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు – ప్రతిభావంతుల సత్కారం డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 07, 2026 11:27 PM

హుజుర్నగర్‌లో 2,160 ఇందిరమ్మ ఇళ్ల మోడల్ కాలనీ ప్రారంభానికి సిద్ధం

హుజుర్నగర్‌లో 2,160 ఇందిరమ్మ ఇళ్ల మోడల్ కాలనీ ప్రారంభానికి సిద్ధం

హుజుర్నగర్‌లో 2,160 ఇందిరమ్మ ఇళ్ల మోడల్ కాలనీ ప్రారంభానికి సిద్ధం
March 10, 2026 06:43 PM 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఈ నెల రెండవ వారంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం : జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

హుజుర్నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రామస్వామి గుట్ట వద్ద నూరిపది ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న రెండు వేల ఒక వంద అరవై ఇందిరమ్మ ఇళ్ల మోడల్ కాలనీని ఈ నెల రెండవ వారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు.మంగళవారం హుజుర్నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న మోడల్ కాలనీని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల బ్లాకులు, అంతర్గత రహదారులు, సభాస్థలి, మొక్కల నాటకం, వాహనాల నిల్వ స్థలం తదితర పనులను పరిశీలించి పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అర్హత లేని వారి పేర్లు జాబితాలో ఉండకూడదని, నిజమైన అర్హులైన వారికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రతి దరఖాస్తును సూక్ష్మంగా పరిశీలించి ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా ఈ ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు అధికారి సిద్ధార్థ, ఉద్యాన శాఖ ప్రాజెక్టు అధికారి నాగయ్య, రెవెన్యూ విభాగాధికారి శ్రీనివాసులు, మిషన్ భగీరథ కార్యనిర్వాహక ఇంజినీరు కరుణాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తహసీల్దార్ కవిత, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News