Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 02:02 PM

హిందూ ధర్మంపై అవగాహన పెంపొందించాలి

హిందూ ధర్మంపై అవగాహన పెంపొందించాలి

హిందూ ధర్మంపై అవగాహన పెంపొందించాలి
February 27, 2026 01:03 PM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్: హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునేలా కృషి చేయాలని మాత బ్రహ్మనందా మాయి ట్రస్ట్ అధినేత శ్రీ శ్రీ శ్రీ బ్రహ్మనందా మాయి అన్నారు. హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో న్యాల్కల్ మండలం బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు ఓంకార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి పూలమాల, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా పరస్పరం ఆధ్యాత్మిక విషయాలపై చర్చించారు. మాత బ్రహ్మనందా మాయి మాట్లాడుతూ ప్రతి ఇంట్లో భగవద్గీత పుస్తకం ఉండాలని, నిత్యం పూజలు చేయడం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుందని పేర్కొన్నారు. హిందూ ధర్మం మన సంస్కృతి, సంప్రదాయాలకు పునాది వంటిదని, ధర్మాచరణతో మనుషుల్లో సత్సంకల్పాలు పెంపొందుతాయని తెలిపారు. ముఖ్యంగా యువత ధర్మం పట్ల ఆసక్తి పెంచుకొని సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని సూచించారు. సమాజంలో శాంతి, సౌహార్దం నెలకొనాలంటే ధార్మిక విలువలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో డా. జనార్దన్ రెడ్డి, నర్సప్ప, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News