హిందూ ధర్మంపై అవగాహన పెంపొందించాలి
హిందూ ధర్మంపై అవగాహన పెంపొందించాలి
Reporter Sangameshwar Reddy
న్యాల్కల్: హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునేలా కృషి చేయాలని మాత బ్రహ్మనందా మాయి ట్రస్ట్ అధినేత శ్రీ శ్రీ శ్రీ బ్రహ్మనందా మాయి అన్నారు. హైదరాబాద్లోని ఆమె నివాసంలో న్యాల్కల్ మండలం బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు ఓంకార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి పూలమాల, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా పరస్పరం ఆధ్యాత్మిక విషయాలపై చర్చించారు. మాత బ్రహ్మనందా మాయి మాట్లాడుతూ ప్రతి ఇంట్లో భగవద్గీత పుస్తకం ఉండాలని, నిత్యం పూజలు చేయడం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుందని పేర్కొన్నారు. హిందూ ధర్మం మన సంస్కృతి, సంప్రదాయాలకు పునాది వంటిదని, ధర్మాచరణతో మనుషుల్లో సత్సంకల్పాలు పెంపొందుతాయని తెలిపారు. ముఖ్యంగా యువత ధర్మం పట్ల ఆసక్తి పెంచుకొని సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని సూచించారు. సమాజంలో శాంతి, సౌహార్దం నెలకొనాలంటే ధార్మిక విలువలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో డా. జనార్దన్ రెడ్డి, నర్సప్ప, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి