Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:24 AM

హిందూ ధర్మంపై అవగాహన పెంపొందించాలి

హిందూ ధర్మంపై అవగాహన పెంపొందించాలి

హిందూ ధర్మంపై అవగాహన పెంపొందించాలి
27-02-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్: హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునేలా కృషి చేయాలని మాత బ్రహ్మనందా మాయి ట్రస్ట్ అధినేత శ్రీ శ్రీ శ్రీ బ్రహ్మనందా మాయి అన్నారు. హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో న్యాల్కల్ మండలం బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు ఓంకార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి పూలమాల, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా పరస్పరం ఆధ్యాత్మిక విషయాలపై చర్చించారు. మాత బ్రహ్మనందా మాయి మాట్లాడుతూ ప్రతి ఇంట్లో భగవద్గీత పుస్తకం ఉండాలని, నిత్యం పూజలు చేయడం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుందని పేర్కొన్నారు. హిందూ ధర్మం మన సంస్కృతి, సంప్రదాయాలకు పునాది వంటిదని, ధర్మాచరణతో మనుషుల్లో సత్సంకల్పాలు పెంపొందుతాయని తెలిపారు. ముఖ్యంగా యువత ధర్మం పట్ల ఆసక్తి పెంచుకొని సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని సూచించారు. సమాజంలో శాంతి, సౌహార్దం నెలకొనాలంటే ధార్మిక విలువలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో డా. జనార్దన్ రెడ్డి, నర్సప్ప, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

హిందూ ధర్మంపై అవగాహన పెంపొందించాలి

Article Image

న్యాల్కల్: హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునేలా కృషి చేయాలని మాత బ్రహ్మనందా మాయి ట్రస్ట్ అధినేత శ్రీ శ్రీ శ్రీ బ్రహ్మనందా మాయి అన్నారు. హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో న్యాల్కల్ మండలం బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు ఓంకార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి పూలమాల, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా పరస్పరం ఆధ్యాత్మిక విషయాలపై చర్చించారు. మాత బ్రహ్మనందా మాయి మాట్లాడుతూ ప్రతి ఇంట్లో భగవద్గీత పుస్తకం ఉండాలని, నిత్యం పూజలు చేయడం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుందని పేర్కొన్నారు. హిందూ ధర్మం మన సంస్కృతి, సంప్రదాయాలకు పునాది వంటిదని, ధర్మాచరణతో మనుషుల్లో సత్సంకల్పాలు పెంపొందుతాయని తెలిపారు. ముఖ్యంగా యువత ధర్మం పట్ల ఆసక్తి పెంచుకొని సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని సూచించారు. సమాజంలో శాంతి, సౌహార్దం నెలకొనాలంటే ధార్మిక విలువలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో డా. జనార్దన్ రెడ్డి, నర్సప్ప, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News