హెల్మెట్ తప్పనిసరి – ప్రాణ రక్షణకు ప్రధాన కవచం
హెల్మెట్ తప్పనిసరి – ప్రాణ రక్షణకు ప్రధాన కవచం
Biksham
పోలీసులకు 350 హెల్మెట్లు అందజేసిన రావుల మల్లేష్
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నర్సింహ స్పష్టం చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా సెవెన్ స్టార్ సోలార్ ఎంటర్ప్రైజెస్ ఎండీ రావుల మల్లేష్ సుమారు రూ.2.50 లక్షల విలువ గల 350 హెల్మెట్లను జిల్లా పోలీసులకు అందజేశారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు ఈ హెల్మెట్లు ఉపయోగపడతాయని ఎస్పీ తెలిపారు.
ఎస్పీ నర్సింహ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలలో ఎక్కువగా తలకు గాయాలు కారణంగా ప్రాణనష్టం జరుగుతుందని, హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చన్నారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ను అలవాటుగా మార్చుకోవాలని సూచించారు.
అడిగిన వెంటనే సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి హెల్మెట్లు అందజేసిన రావుల మల్లేష్ను ఎస్పీ అభినందించి శాలువాతో సన్మానించారు. సమాజంలో భద్రతా చర్యలకు సహకరించే సంస్థలు, వ్యక్తులు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు.
రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు పోలీస్ శాఖ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని, ప్రజలు కూడా పోలీసులకు సహకరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్పీ కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి