Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడే మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష కదం తొక్కిన గిల్.. కోల్‌కతాపై గుజరాత్‌ ఘన విజయం రైతు కుటుంబానికి అండగా రెడ్స్ సంస్థ ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 18, 2026 08:07 PM

హెల్మెట్ తప్పనిసరి – ప్రాణ రక్షణకు ప్రధాన కవచం

హెల్మెట్ తప్పనిసరి – ప్రాణ రక్షణకు ప్రధాన కవచం

హెల్మెట్ తప్పనిసరి – ప్రాణ రక్షణకు ప్రధాన కవచం
April 18, 2026 06:24 PM 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పోలీసులకు 350 హెల్మెట్లు అందజేసిన రావుల మల్లేష్

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నర్సింహ స్పష్టం చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా సెవెన్ స్టార్ సోలార్ ఎంటర్‌ప్రైజెస్ ఎండీ రావుల మల్లేష్ సుమారు రూ.2.50 లక్షల విలువ గల 350 హెల్మెట్లను జిల్లా పోలీసులకు అందజేశారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు ఈ హెల్మెట్లు ఉపయోగపడతాయని ఎస్పీ తెలిపారు.

ఎస్పీ నర్సింహ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలలో ఎక్కువగా తలకు గాయాలు కారణంగా ప్రాణనష్టం జరుగుతుందని, హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చన్నారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్‌ను అలవాటుగా మార్చుకోవాలని సూచించారు.

అడిగిన వెంటనే సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి హెల్మెట్లు అందజేసిన రావుల మల్లేష్‌ను ఎస్పీ అభినందించి శాలువాతో సన్మానించారు. సమాజంలో భద్రతా చర్యలకు సహకరించే సంస్థలు, వ్యక్తులు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు.

రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు పోలీస్ శాఖ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని, ప్రజలు కూడా పోలీసులకు సహకరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్పీ కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News