తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ఆర్ యు & ఏ లివ్” అవగాహన కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై ప్రత్యేక చైతన్యం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో యాదగిరిగుట్టకు చెందిన సీఐ ఎలగొండ కృష్ణ కుమారుడు ఎలగొండ రూమీన్ సాయి (8వ తరగతి) హెల్మెట్ ప్రాముఖ్యతపై ఏఐ టెక్నాలజీతో ఒక వినూత్న పాట రూపొందించాడు.
ఈ పాటను భువనగిరి ట్రాఫిక్ డివిజన్ డీఎస్పీ ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించి, పాట ఎంతో ప్రభావవంతంగా ఉందని ప్రశంసించారు. అలాగే రూమీన్ సాయిని అభినందిస్తూ సన్మానించారు.
ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట ట్రాఫిక్ సీఐ ఎలగొండ కృష్ణ, భువనగిరి ట్రాఫిక్ సీఐ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు భద్రతపై యువతలో చైతన్యం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి