హయత్నగర్ డిగ్రీ కాలేజీలో సింగిల్-యూజ్ ప్లాస్టిక్పై అవగాహన
హయత్నగర్ డిగ్రీ కాలేజీలో సింగిల్-యూజ్ ప్లాస్టిక్పై అవగాహన
స్థానికం బృందం
హయత్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సింగిల్-యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. కళాశాల రసాయనశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి రంగారెడ్డి జిల్లా ప్రాంతీయ కార్యాలయం సహకారంతో “సింగిల్-యూజ్ ప్లాస్టిక్: వద్దు అని చెప్పాల్సిన అవసరం” అనే అంశంపై ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. సురేష్ బాబు మాట్లాడుతూ, సింగిల్-యూజ్ ప్లాస్టిక్ వల్ల సముద్ర జీవరాశి, నేల ఆరోగ్యం, మానవ శ్రేయస్సుపై తీవ్రమైన దుష్ప్రభావాలు ఉంటాయని తెలిపారు. వాటి వినియోగాన్ని తక్షణమే నియంత్రించాల్సిన అవసరం ఉందని విద్యార్థులకు సూచించారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న పర్యావరణ ఇంజనీర్ ఎం. వెంకట్ నర్సు, సహాయ పర్యావరణ శాస్త్రవేత్త డా. ఆర్. మహేష్ ప్లాస్టిక్ వ్యర్థాల ప్రభావం, నివారణ మార్గాలపై వివరించారు. గ్లోబల్ రీసైక్లింగ్ డే సందర్భంగా పర్యావరణ హిత చర్యలను అనుసరించాలని విద్యార్థులను కోరారు.
కార్యక్రమంలో ఐక్యూఏసీ కోఆర్డినేటర్ మధు ధర్మపురి, డా. డి. బాల నరసింహ, డా. వి. శేఖర్, డా. వి. గీతా నాయక్, డా. దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. చివరగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు సంకల్పం వ్యక్తం చేయించారు.
ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి