హయత్నగర్ డిగ్రీ కళాశాలలో తైక్వాండో కోర్సు ప్రారంభం
హయత్నగర్ డిగ్రీ కళాశాలలో తైక్వాండో కోర్సు ప్రారంభం
స్థానికం బృందం
హయత్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తైక్వాండోలో 30 గంటల ఆత్మరక్షణ సర్టిఫికేట్ కోర్సును బుధవారం ప్రారంభించారు. కళాశాల అంతర్గత నియమపాలన విభాగం మరియు మహిళా సాధికారత విభాగం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.
ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. సురేష్ బాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువతీ యువకుల్లో ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు వ్యక్తిగత భద్రత, సాధికారత కోసం ఇటువంటి కోర్సులు అత్యంత అవసరమని పేర్కొన్నారు.
మహిళా సాధికారత కన్వీనర్ డా. అపర్ణ చతుర్వేది, అంతర్గత నియమపాలన విభాగం కన్వీనర్ డా. కె. అనితా ఆధ్వర్యంలో ఈ కోర్సును ప్రారంభించగా, వారి కృషిని ప్రిన్సిపాల్ అభినందించారు.
కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి వి. ఇందిర, డా. గీతా నాయక్, డా. ఆర్. రమాదేవి, డా. పి. రామదేవి, డా. శారద, ప్రొఫెసర్ నాగేంద్ర తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి