Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:15 AM

హయత్‌నగర్ డిగ్రీ కళాశాలలో తైక్వాండో కోర్సు ప్రారంభం

హయత్‌నగర్ డిగ్రీ కళాశాలలో తైక్వాండో కోర్సు ప్రారంభం

హయత్‌నగర్ డిగ్రీ కళాశాలలో తైక్వాండో కోర్సు ప్రారంభం
March 18, 2026 07:28 PM 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తైక్వాండోలో 30 గంటల ఆత్మరక్షణ సర్టిఫికేట్ కోర్సును బుధవారం ప్రారంభించారు. కళాశాల అంతర్గత నియమపాలన విభాగం మరియు మహిళా సాధికారత విభాగం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.

ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. సురేష్ బాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువతీ యువకుల్లో ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు వ్యక్తిగత భద్రత, సాధికారత కోసం ఇటువంటి కోర్సులు అత్యంత అవసరమని పేర్కొన్నారు.

మహిళా సాధికారత కన్వీనర్ డా. అపర్ణ చతుర్వేది, అంతర్గత నియమపాలన విభాగం కన్వీనర్ డా. కె. అనితా ఆధ్వర్యంలో ఈ కోర్సును ప్రారంభించగా, వారి కృషిని ప్రిన్సిపాల్ అభినందించారు.

కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి వి. ఇందిర, డా. గీతా నాయక్, డా. ఆర్. రమాదేవి, డా. పి. రామదేవి, డా. శారద, ప్రొఫెసర్ నాగేంద్ర తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News