Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:05 AM

హయత్‌నగర్ డిగ్రీ కళాశాలలో తైక్వాండో కోర్సు ప్రారంభం

హయత్‌నగర్ డిగ్రీ కళాశాలలో తైక్వాండో కోర్సు ప్రారంభం

హయత్‌నగర్ డిగ్రీ కళాశాలలో తైక్వాండో కోర్సు ప్రారంభం
18-03-2026 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తైక్వాండోలో 30 గంటల ఆత్మరక్షణ సర్టిఫికేట్ కోర్సును బుధవారం ప్రారంభించారు. కళాశాల అంతర్గత నియమపాలన విభాగం మరియు మహిళా సాధికారత విభాగం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.

ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. సురేష్ బాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువతీ యువకుల్లో ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు వ్యక్తిగత భద్రత, సాధికారత కోసం ఇటువంటి కోర్సులు అత్యంత అవసరమని పేర్కొన్నారు.

మహిళా సాధికారత కన్వీనర్ డా. అపర్ణ చతుర్వేది, అంతర్గత నియమపాలన విభాగం కన్వీనర్ డా. కె. అనితా ఆధ్వర్యంలో ఈ కోర్సును ప్రారంభించగా, వారి కృషిని ప్రిన్సిపాల్ అభినందించారు.

కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి వి. ఇందిర, డా. గీతా నాయక్, డా. ఆర్. రమాదేవి, డా. పి. రామదేవి, డా. శారద, ప్రొఫెసర్ నాగేంద్ర తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

Sthanikam

హయత్‌నగర్ డిగ్రీ కళాశాలలో తైక్వాండో కోర్సు ప్రారంభం

Article Image

హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తైక్వాండోలో 30 గంటల ఆత్మరక్షణ సర్టిఫికేట్ కోర్సును బుధవారం ప్రారంభించారు. కళాశాల అంతర్గత నియమపాలన విభాగం మరియు మహిళా సాధికారత విభాగం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.

ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. సురేష్ బాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువతీ యువకుల్లో ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు వ్యక్తిగత భద్రత, సాధికారత కోసం ఇటువంటి కోర్సులు అత్యంత అవసరమని పేర్కొన్నారు.

మహిళా సాధికారత కన్వీనర్ డా. అపర్ణ చతుర్వేది, అంతర్గత నియమపాలన విభాగం కన్వీనర్ డా. కె. అనితా ఆధ్వర్యంలో ఈ కోర్సును ప్రారంభించగా, వారి కృషిని ప్రిన్సిపాల్ అభినందించారు.

కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి వి. ఇందిర, డా. గీతా నాయక్, డా. ఆర్. రమాదేవి, డా. పి. రామదేవి, డా. శారద, ప్రొఫెసర్ నాగేంద్ర తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News