హయత్నగర్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్నగర్లో “99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక”లో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల్లో ఐదో రోజు గ్రంథాలయ విభాగం ఆధ్వర్యంలో “మన గ్రంథాలయ జ్ఞానోత్సవం–విశ్వ గ్రంథాలయ దినోత్సవం” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పుస్తక ప్రదర్శన, బుక్టాక్స్, పుస్తక దాన కార్యక్రమం, ఉత్తమ పాఠకుల సన్మానం, గ్రంథాలయ సేవల వినియోగంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఉత్తమ అధ్యాపక పాఠకుడిగా విద్యాసాగర్, ఉత్తమ విద్యార్థి పాఠకురాలిగా బీఏ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని ఆదిత్యను సత్కరించారు. కళాశాల గ్రంథాలయానికి పుస్తకాలు అందజేసిన శుభాసిని, డాక్టర్ గీత నాయక్, డాక్టర్ వెంకటేశ్వర్లును అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి