Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 12:26 PM

హౌస్ లిస్టింగ్ పకడ్బందీగా చేపట్టాలి

హౌస్ లిస్టింగ్ పకడ్బందీగా చేపట్టాలి

హౌస్ లిస్టింగ్ పకడ్బందీగా చేపట్టాలి
April 18, 2026 06:24 PM 188 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశాలు

జనగణన–2027 కార్యక్రమంలో భాగంగా హౌస్ లిస్టింగ్ ప్రక్రియను కచ్చితంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు.

నూతనకల్ జడ్‌పీహెచ్‌ఎస్‌లో నిర్వహించిన తొలి విడత శిక్షణా కార్యక్రమంలో పాల్గొని జనగణనలో పాల్గొనే సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతి ఇంటిని నమోదు చేయాలని, ఏ ఒక్క ఇల్లు కూడా మిగలకుండా ప్రతి వీధిలో చివరి వరకు లెక్కలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇంటి వివరాలను పూర్తిగా నమోదు చేసి, సంబంధిత సమాచారాన్ని మొబైల్ ద్వారా నమోదు చేయాలని సూచించారు. సమాచారం నమోదు సమయంలో ఖచ్చితత్వం పాటించాలని తెలిపారు.

అనంతరం ఆశా సిబ్బందితో మాట్లాడి గ్రామంలోని ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో సునీత, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News