హౌస్ లిస్టింగ్ పకడ్బందీగా చేపట్టాలి
హౌస్ లిస్టింగ్ పకడ్బందీగా చేపట్టాలి
Biksham
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశాలు
జనగణన–2027 కార్యక్రమంలో భాగంగా హౌస్ లిస్టింగ్ ప్రక్రియను కచ్చితంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు.
నూతనకల్ జడ్పీహెచ్ఎస్లో నిర్వహించిన తొలి విడత శిక్షణా కార్యక్రమంలో పాల్గొని జనగణనలో పాల్గొనే సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతి ఇంటిని నమోదు చేయాలని, ఏ ఒక్క ఇల్లు కూడా మిగలకుండా ప్రతి వీధిలో చివరి వరకు లెక్కలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇంటి వివరాలను పూర్తిగా నమోదు చేసి, సంబంధిత సమాచారాన్ని మొబైల్ ద్వారా నమోదు చేయాలని సూచించారు. సమాచారం నమోదు సమయంలో ఖచ్చితత్వం పాటించాలని తెలిపారు.
అనంతరం ఆశా సిబ్బందితో మాట్లాడి గ్రామంలోని ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో సునీత, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి