Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడే మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష కదం తొక్కిన గిల్.. కోల్‌కతాపై గుజరాత్‌ ఘన విజయం రైతు కుటుంబానికి అండగా రెడ్స్ సంస్థ ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 18, 2026 08:01 PM

హౌస్ లిస్టింగ్ పకడ్బందీగా చేపట్టాలి

హౌస్ లిస్టింగ్ పకడ్బందీగా చేపట్టాలి

హౌస్ లిస్టింగ్ పకడ్బందీగా చేపట్టాలి
April 18, 2026 06:24 PM 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశాలు

జనగణన–2027 కార్యక్రమంలో భాగంగా హౌస్ లిస్టింగ్ ప్రక్రియను కచ్చితంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు.

నూతనకల్ జడ్‌పీహెచ్‌ఎస్‌లో నిర్వహించిన తొలి విడత శిక్షణా కార్యక్రమంలో పాల్గొని జనగణనలో పాల్గొనే సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతి ఇంటిని నమోదు చేయాలని, ఏ ఒక్క ఇల్లు కూడా మిగలకుండా ప్రతి వీధిలో చివరి వరకు లెక్కలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇంటి వివరాలను పూర్తిగా నమోదు చేసి, సంబంధిత సమాచారాన్ని మొబైల్ ద్వారా నమోదు చేయాలని సూచించారు. సమాచారం నమోదు సమయంలో ఖచ్చితత్వం పాటించాలని తెలిపారు.

అనంతరం ఆశా సిబ్బందితో మాట్లాడి గ్రామంలోని ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో సునీత, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News